ప్ర‌తీ పైసా క‌క్కిస్తాం

మాజీ మంత్రి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి

వ‌రికుంట‌పాడులో జామాయిల్ భూముల‌ను ప‌రిశీలించిన కాకాణి

ప్ర‌తీ పైసా క‌క్కిస్తాం….

  • మాజీ మంత్రి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి
  • వ‌రికుంట‌పాడులో జామాయిల్ భూముల‌ను ప‌రిశీలించిన కాకాణి

అక్ర‌మంగా దోచేసిన ప్ర‌తీ పైసాని క‌క్కిస్తామ‌ని… మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి హెచ్చ‌రించారు.
నెల్లూరు జిల్లా వ‌రికుంట‌పాడు మండ‌లం అగ్రిగోల్డ్ భూముల్లోని జామాయిల్ అక్ర‌మ త‌ర‌లింపును ఆయ‌న ఎమ్మెల్సీ చంద్ర‌శేఖరెడ్డి, వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి మేక‌పాటి రాజ‌గోపాల్ రెడ్డిల‌తో క‌లిసి ప‌రిశీలించారు. అనంత‌రం కాకాణి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల్లోనే కొంతమంది స్వార్ధ పరులు, ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటూ, జేబులు నింపుకుంటున్నార‌ని ఆరోపించారు. ఇంత అరాచ‌క పాల‌న ఎన్న‌డూ చూడ‌లేద‌ని మండిప‌డ్డారు. పోలీసు, రెవెన్యూ వ్యవస్థల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ సంపదకు రక్షణ లేకపోవడం దారుణమ‌న్నారు. నిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయ‌న డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *