ట్రైనీ డీఎస్పీ శివప్రియ – కోవూరు వసతి గృహాల్లోని విద్యార్థులకి వాచీలు పంపిణీ
పది విద్యార్థి జీవితంలో అత్యంతక కీలకం…
- ట్రైనీ డీఎస్పీ శివప్రియ
- కోవూరు వసతి గృహాల్లోని విద్యార్థులకి వాచీలు పంపిణీ
పదో తరగతి అనేది విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమని…ట్రైనీ డీఎస్పీ శివప్రియ సూచించారు. పెద్ది ప్రభావతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో… నెల్లూరు జిల్లా కోవూరు ఎస్డబ్ల్యూ పరిధిలోని ఏడు వసతి గృహాల్లోని విద్యార్థులకి హోలీ పర్వదినం సందర్భంగా వాచీలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రైనీ డీఎస్పీ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ముందుగా ఆమెకి విద్యార్థులు, ట్రస్ట్ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ట్రైనీ డీఎస్పీ చేతుల మీదుగా విద్యార్థులకి వాచీలు పంపిణీ చేశారు. అనంతరం ఆమె విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులందరూ ఒక లక్ష్యాన్ని ఎంచుకొని…దానిని సాధించే వరకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రతీ విద్యార్థి తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. గత మూడేళ్లుగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపడుతున్న ట్రస్ట్ నిర్వాహకులు పెద్ది మారుతి నాగార్జున, సత్యవతి దంపతులను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. అనంతరం ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ నరసింహమూర్తి, ఎస్ఐ రంగనాథ్ గౌడ్ లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ డబ్ల్యూ ఓ తిరుపతయ్య హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు….