వేమిరెడ్డి సుడిగాలి ప‌ర్య‌ట‌న‌

ధాన్యం కొనుగోళ్ల విష‌యాల‌ను రైతుల‌తో నేరుగా మాట్లాడిన వేమిరెడ్డి

జ‌ల‌దంకి, బోగోలు మండ‌లాల్లోని ధాన్యం కేంద్రాల‌ను సంద‌ర్శించిన రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల సంస్థ డైరెక్ట‌ర్

వేమిరెడ్డి ప‌ట్టాభిరామిరెడ్డి

వేమిరెడ్డి సుడిగాలి ప‌ర్య‌ట‌న‌…

  • ధాన్యం కొనుగోళ్ల విష‌యాల‌ను రైతుల‌తో నేరుగా మాట్లాడిన వేమిరెడ్డి
  • జ‌ల‌దంకి, బోగోలు మండ‌లాల్లోని ధాన్యం కేంద్రాల‌ను సంద‌ర్శించిన రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల సంస్థ డైరెక్ట‌ర్ వేమిరెడ్డి ప‌ట్టాభిరామిరెడ్డి

నెల్లూరు జిల్లాలో రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల సంస్థ డైరెక్ట‌ర్ వేమిరెడ్డి ప‌ట్టాభిరామిరెడ్డి సుడిగాలి ప‌ర్య‌ట‌న జ‌రిపారు. జిల్లాలోని ప‌లు మండ‌లాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను ఆయ‌న సంద‌ర్శించారు. కావ‌లి నియోజ‌క‌వ‌ర్గం జ‌ల‌దంకి మండ‌లంలోని చిన్నకాక్ర గ్రామం, బోగోలు మండ‌లంలోని నాగుల‌వ‌రం గ్రామాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను వేమిరెడ్డి ప‌రిశీలించారు. అక్క‌డే ఉన్న రైతుల‌తో ఆయ‌న మాట్లాడి…ధాన్యం కొనుగోలు స‌క్ర‌మంగా జ‌రుగుతుందా….న‌గ‌దు 24 గంట‌ల్లోనే మీ ఖాతాల్లో జ‌మ అవుతుందా లేదా అని ప‌లు విష‌యాల‌ను అడిగి తెలుసుకున్నారు. ప‌లువురు రైతులు త‌మ ఖాతాల్లో న‌గ‌దు జ‌మ అవుతుంద‌ని చెప్ప‌డంతో ఆయ‌న సంతోషం వ్య‌క్తం చేశారు. అనంత‌రం వేమిరెడ్డి ప‌ట్టాభి రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ….రైతులు రైతు సేవ కేంద్రానికి వెళ్ళవలసిన అవసరం లేకుండానే ప్రభుత్వం వాట్సాప్ నంబర్ 7337359375 కి మీ వాట్సాప్ నెంబర్ నుండి హాయ్ అని మెసేజ్ పెడితే మీ ధాన్యానికి షెడ్యూలింగ్ మెసేజ్ వస్తుందన్నారు. దీని ద్వారా మీరు ధాన్యం అమ్మకానికి సిద్ధమైనట్లు పిపిసికి అందుతుందని తెలియజేశారు. దాళారులు రైతుల వద్ద మద్దత్తు ధ‌రకంటే తక్కువ కొనుగోలు చేయకూడదని వేమిరెడ్డి హెచ్చ‌రించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ లక్ష్మీనారాయణ, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, గ్రామంలోని ముఖ్య నాయకులు, రైతులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *