జులై 30వ తేదీ ప్రజలకు అంకితం చేస్తాం

రూ.4 కోట్లతో ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో క్రిటికల్ కేర్ యూనిట్

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

జీజీహెచ్‌లో క్రిటిక‌ల్ కేర్ యూనిట్ ప‌నుల‌ను ప‌రిశీలించిన ఎమ్మెల్యే

జులై 30వ తేదీ ప్రజలకు అంకితం చేస్తాం….

  • 4 కోట్లతో ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో క్రిటికల్ కేర్ యూనిట్
  • నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
  • జీజీహెచ్‌లో క్రిటిక‌ల్ కేర్ యూనిట్ ప‌నుల‌ను ప‌రిశీలించిన ఎమ్మెల్యే

ప్రభుత్వ ప్రధాన వైద్యశాల లో 24 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ పనులను జులై 30వ‌తేదీ క‌ల్లా పూర్తి చేసి ప్ర‌జ‌ల‌కు అంకితం చేస్తామ‌ని నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో జ‌రుగుతున్న‌ 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ పనులను ఆయ‌న జీజీహెచ్ అధికారులు, స్థానిక టీడీపీ నాయ‌కుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. ముందుగా ఎమ్మెల్యేకి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. జ‌రుగుతున్న ప‌నుల‌ను కాంట్రాక్ట‌ర్‌ని అడిగి తెలుసుకున్నారు. ప‌నుల్లో ఖ‌చ్చితంగా నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించాల‌ని ఎమ్మెల్యే వారిని ఆదేశించారు. అనంత‌రం ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ క్రిటికల్ కేర్ యూనిట్ నెల్లూరు జిల్లాకే తలమానికమ‌న్నారు. అత్యంత ఆధునిక వసతులతో ఏర్పాటు చేస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ ప్రజలకు మేలు చేస్తుందన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జీజీహెచ్ అధికారులు, ప‌లువురు వైద్యులు, టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *