నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు
రంగుల రాట్నాలు, జైంట్ వీల్, కొలంబస్ వంటివాటితో ఉర్రూతులూగిన యువత, చిన్నారులు
కోలాహలంగా కొండ బిట్రగుంట తిరునాళ్లు
- నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
- స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు
- రంగుల రాట్నాలు, జైంట్ వీల్, కొలంబస్ వంటివాటితో ఉర్రూతులూగిన యువత, చిన్నారులు
రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర బ్రహ్మోత్సవాల తిరునాళ్లు గురువారం రాత్రి కోలాహాలాన్ని తలపించింది. రాష్ట్ర నలుమూలల నుంచి కుటుంబ సభ్యులతో ఈ తిరుణాళ్లకు భారీగా చేరుకున్నారు. జాతీయ రహదారి నుంచి కొండ బిట్రగుంట వరకు ఇరువైపులా చెట్లకు ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతులు ఎంతో
ఆకట్టుకున్నాయి. ముందుగా కొండపై కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినీ దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మరోపక్క కొండకింద వివిధ దుకాణాల ఏర్పాటు, అక్కడకు భక్తులు వచ్చి కొనుగోళ్లతో అక్కడ సందడి నెలకుంది. రంగుల రాట్నాలు, జైంట్ వీల్, కొలంబస్ వంటివాటిపై యువత, చిన్నారులు ఊగి ఉర్రూతులూగారు. ఒకపక్క స్వామివారి భక్తిసేవా కార్యక్రమాలు, మరోపక్క తిరునాల కోలాహాలంతో సందడే సందడి తలపించింది.