జీవితపోరాటంలో ఒంటరిగా ఎదురొడ్డి పోరాడిన ధీరవనిత
నాటి అనాధ నేడు ఎందరో మహిళలకు స్ఫూర్తి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం గుర్తింపు.
ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా కమలకు ఉత్తమ మహిళా అవార్డు
ఆత్మ స్థైర్యానికి నిలువుటద్దం కమల…!
- జీవితపోరాటంలో ఒంటరిగా ఎదురొడ్డి పోరాడిన ధీరవనిత
- నాటి అనాధ నేడు ఎందరో మహిళలకు స్ఫూర్తి
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం గుర్తింపు.
- ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా కమలకు ఉత్తమ మహిళా అవార్డు
జీవిత పోరాటంలో ఎగిసిన కెరటం ఆమె… ఎన్ని కష్టాలు వచ్చినా కుంగిపోకుండా..ఎదురొడ్డి పోరాడింది. ఎవరూ లేని అనాధగా మిగిలినా సమాజమే ఆత్మ బందువునిగా చేసుకుంది. అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంది. క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత చదువులు చదివింది. నేడు సమాజంలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. అనేక సంఘర్షణలతో కుంగిపోతున్న ఎందరో బాలికలకు, మహిళలకు ఆత్మస్థైర్యాన్ని నింపుతూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంది. ఆమె జీవితంలో ఎదిగిన తీరు.. ప్రతిభ పాటవాలను ప్రభుత్వం గుర్తించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తమ మహిళా అవార్డుకు ఎంపిక చేసింది. మార్కాపురంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డును అందించింది. ఆమె ఎవరో కాదు మన నెల్లూరు మహిళ. కమల ఎవరు…? ఆమె జీవితంలో ఎదుర్కొన్న ఘటనలు ఏమిటి…? అంతర్జాతీయ మహిళా ఆమె విజయగాధను N3 న్యూస్ మీకు అందిస్తుంది. వాచ్ ది ఎన్ త్రీ న్యూస్.
నెల్లూరు ప్రాంతానికి చెందిన రఘు,అరుణలు అనేవారు కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి కమల, మహేష్ పిల్లలు పుట్టాక రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. మూడేళ్ల కమల, రెండేళ్ల మహేష్ లు అనాధలు అయ్యారు. వీరిని నా అన్నవారు ఎవరూ దగ్గరకి తీయలేదు. దీంతో ఎన్ సీ ఎల్ పీ డైరెక్టర్ మధు అనే ఆయన వీరిద్దరినీ దగదర్తి మండలం ఆర్యభట్ట ఆశ్రమంలో చేర్పించారు. కొద్ది రోజులకే కమలకు తమ్ముడు దూరం అయ్యాడు. తమ్ముడు కానరాక నాడు ఆ పసి హృదయం తల్లడిల్లింది. ఉన్నా ఆ ఒక్క బంధం తెగిపోయింది. ఇలా ఆరో తరగతి వరకు ఆశ్రమంలో, కావలిలో 8వ తరగతి వరకు, 10 వరకు కొడవలూరు బాలికల వసతి గృహంలో చదివింది. ఇంటర్ కావలి జవహర్ భారతి కళాశాలలో చదివింది. నాటి జిల్లా కలెక్టర్ రవిచంద్ర కమలకు ఫీజు చెల్లించాడు. ఇంటర్ పూర్తయ్యాక అల్లూరు గొల్లపాలెం ఆశ్రమంలో చేరింది. ఆ ఆశ్రమ నిర్వాహకుడు రామచంద్ర శరత్ బాబు ద్వారా కావలి రెడ్ క్రాస్ లో చేరింది. ఇక్కడ పీఆర్వో గా విధులు నిర్వహిస్తూ రక్తదాన శిబిరాలు, ల్యాబ్ లో పనిచేసి వచ్చిన స్టైపెండ్ తో తన డిగ్రీ దూర విద్యను పూర్తి చేసింది. నాటి జిల్లా కలెక్టర్ జానికి సహాయంతో పద్మావతి విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేసింది. 2017లో స్త్రీ శిశు సంక్షేమ శాఖలో సఖీ ఒన్ స్టాప్ సోషల్ కౌన్సిలర్ గా ఉద్యోగంలో చేరింది. కలెక్టరేట్ లోని కులాంతర వివాహాల సెల్ లో నూ రెండేళ్లు పనిచేసింది. గత ఏడేళ్లుగా తనవద్దకు వచ్చిన భార్యాభర్తల కలహాల 500 పైగా కేసులపై సఖీ ఒన్ స్టాప్ సోషల్ కౌన్సిలర్ గా వారికి కౌన్సెలింగ్ ఇచ్చింది. వారికి కుటుంబ విలువలు వివరించి, భార్యా భర్తలు విడిపోతే సమాజంలో వారి పిల్లలు ఎదుర్కొనే సమస్యలు తెలియజేసి ఇద్దరూ కలిసి పోయేలా చేసి వారి కుటుంబాల్లో వెలుగులు నింపింది. అనాధగా ఉన్నా కమల వివాహం చేసుకొని ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని ధీర వనితగా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది.