ఇంకా సీఎం పేరు మార్చల
రాముడుపాలెం రైతు భరోసా కేంద్రంలో ఇష్టారాజ్యం
అధికారుల పనితీరును ప్రశ్నిస్తున్న ప్రజలు
మధ్యాహ్నం సమయానికే మూత
- ఇంకా సీఎం పేరు మార్చలా
- రాముడుపాలెం రైతు భరోసా కేంద్రంలో ఇష్టారాజ్యం
- అధికారుల పనితీరును ప్రశ్నిస్తున్న ప్రజలు
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండల పరిధిలోని కుడితిపాలెం పంచాయతీ రాముడుపాలెం రైతు భరోసా కేంద్రాన్ని మధ్యాహ్నం సమయానికే మూస్తున్నారు. దీంతో వివిధ పనులపై వస్తున్న రైతులు, ప్రజలు నిరాశతో వెనుదిరిగారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను అమలు చేస్తుంది. అయితే ఆయా కార్యాలయాలను పనివేళల్లో తీయకపోతే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే తొమ్మిది నెలలు కావస్తున్న ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి పేరు కూడా మార్చని దృశ్యాలు ప్రజల విమర్శలకు తావిస్తున్నాయి.