దాతృత్వం చాటుకున్న ప్రవాస భారతీయులు మధు కిరణ్ రెడ్డి
50 మంది దంపతులకు వస్త్రములు అందజేత.
తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కందుకూరు మండలం కొండముడుసుపాలెం గ్రామంలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రవాస భారతీయులు రామిరెడ్డి వేంకటరామిరెడ్డి, హైమావతమ్మ దంపతుల కుమారుడు మధు కిరణ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో ఆర్థికంగా వెనుకబడిన 50 మంది దంపతులకు వస్త్రములు, సంభావనలను ఆలయ ప్రధాన అర్చకులు వాకాని శ్రీనివాసాచార్యులు, విజయలక్ష్మి దంపతులు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి వాకాని హేమంత్ కుమార్, కళ్యాణ్ కృష్ణ లు మాట్లాడుతూ ప్రవాస భారతీయులు వేంకటరామిరెడ్డి,హైమావతమ్మ దంపతులు థార్మికతను,హైందవ సాంప్రదాయాన్నికాపాడే అర్చక, పురోహిత కుటుంబాలకు చేయూతనీయాలనే సదుద్దేశ్యంతో వస్త్ర సమర్పణం, సంభావనలను అందచేయడం చాలా సంతోషం అన్నారు. కార్యక్రమంలో అభ్యుదయ, గాయత్రి కిషోర్,రజిని,వాసు,పద్మజ,రేవంత్,హర్షిత,గోపి,షణ్ముఖ్,నాగరాజు,లక్ష్మణ్,శ్రీనివాస్,విజయ తదితరులు పాల్గొన్నారు