యువత పోరుకు సిద్ధం కావాలి

వింజ‌మూరులో యువ‌త పోరు పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించిన వైసీపీ నాయ‌కులు

యువత పోరుకు సిద్ధం కావాలి…

  • వింజ‌మూరులో యువ‌త పోరు పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించిన వైసీపీ నాయ‌కులు

నెల్లూరు జిల్లా వింజ‌మూరులోని వీఆర్ ఫంక్ష‌న్ ప్లాజాలో…యువ‌త పోరు కార్య‌క్ర‌మ వాల్ పోస్ట‌ర్‌ను వైసీపీ నాయ‌కులు ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా వారు మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మార్చి 12, తేదీన యువత పోరు కార్యక్రమాన్ని చేప‌డుతున్నామ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, యువ‌త పెద్ద సంఖ్య‌లో పాల్గొని జ‌య‌ప్ర‌దం చేయాల‌ని పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పిస్తామ‌ని చెప్పారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ రేవునూరి శ్రీనివాసులు రెడ్డి, పల్లాల. కొండారెడ్డి, డేగా వంశీ యాదవ్, నాగమణి, ప్రసాద్, రమణయ్య, వైస్సార్సీపీ నాయుకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *