జ‌గ‌న్‌ను మ‌ళ్లీ సీఎంను చేసుకుంటాం

పార్టీ కోసం అంతా క‌ల‌సి ప‌నిచేస్తాం

ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌ని కూట‌మి ప్ర‌భుత్వం

ఘ‌నంగా మేక‌పాటి కార్యాల‌యంలో వైసీపీ ఆవిర్భావ‌దినోత్స‌వం

వైసీపీ జిల్లా ఉపాధ్య‌క్షులు డాక్ట‌ర్ చిల్లూరు ఆదిశేష‌య్య‌

జ‌గ‌న్‌ను మ‌ళ్లీ సీఎంను చేసుకుంటాం

  • పార్టీ కోసం అంతా క‌ల‌సి ప‌నిచేస్తాం
  • ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌ని కూట‌మి ప్ర‌భుత్వం
  • ఘ‌నంగా మేక‌పాటి కార్యాల‌యంలో వైసీపీ ఆవిర్భావ‌దినోత్స‌వం
  • వైసీపీ జిల్లా ఉపాధ్య‌క్షులు డాక్ట‌ర్ చిల్లూరు ఆదిశేష‌య్య‌

రాష్ట్రం పురోభివృద్ధి కోసం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిని చేసుకునేందుకు పార్టీ శ్రేణుల‌మంతా క‌లిసిక‌ట్టుగా ప‌ని చేస్తామ‌ని వైసీపీ జిల్లా ఉపాధ్య‌క్షులు డాక్ట‌ర్ చిల్లూరు ఆదిశేష‌య్య తెలిపారు. ఆత్మ‌కూరు మాజీ ఎమ్మెల్యే విక్ర‌మ్‌రెడ్డి ఆదేశాల‌తో.. నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు ప‌ట్ట‌ణంలోని వైసీపీ కార్యాల‌యంలో ఆ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. జిల్లా పార్టీ ఉపాధ్య‌క్షులు డాక్ట‌ర్ చిల్ల‌కూరు ఆదిదేశ‌ష‌య్య ఆధ్వ‌ర్యంలో వైసీపీ నాయ‌కులు పార్టీ జెండాను ఆవిష్క‌రించారు. జై జగన్.. జై వైయస్సార్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో 15 కేజీల కేక్ ని కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ ఆదిశేష‌య్య మీడియాతో మాట్లాడారు. రాబోవు రోజుల్లో వైఎస్ఆర్సిపిని అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. తామంతా కలిసి పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ ఈ తొమ్మిది నెలల్లో ప్ర‌జ‌ల‌కు ఏమీ చేయలేదని.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని దుయ్య‌బ‌ట్టారు. దీంతో కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ‌చ్చింద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *