కూట‌మిలోనే అభివృద్ధి

నెల్లూరు రూరల్ 195 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు – టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి

నెల్లూరురూర‌ల్ 19,22,31,35 డివిజ‌న్ల‌లో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంఖుస్థాప‌న‌లు చేసిన కోటంరెడ్డి

కూట‌మిలోనే అభివృద్ధి…

  • నెల్లూరు రూరల్ 195 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు
  • టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి
  • నెల్లూరురూర‌ల్ 19,22,31,35 డివిజ‌న్ల‌లో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంఖుస్థాప‌న‌లు చేసిన కోటంరెడ్డి

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామ‌ని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధ‌ర్‌రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 19, 22, 31, 35వ డివిజన్ లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయ‌న స్థానిక ప్రజలతో కలిసి శంకుస్థాపనల కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా కోటంరెడ్డికి డివిజ‌న్ల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న స్థానిక ప్ర‌జ‌ల‌తో క‌లిసి అభివృద్ధి ప‌నుల‌కు శంఖుస్థాప‌న‌లు చేశారు. అనంత‌రం కోటంరెడ్డి గిరిధ‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రూరల్ నియోజకవర్గంలోని 26 డివిజన్లలో మరియు 18 గ్రామాలతో కలిపి రూ. 191 కోట్ల‌తో అభివృద్ధి ప‌నులు చేప‌ట్టామ‌ని తెలియ‌జేశారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జీలు, కార్పొరేటర్లు, కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *