జనసేన నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్బాబు
నగర జనసేన పార్టీ కార్యాలయంలో.. ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
-జనసేన నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్బాబు
-నగర జనసేన పార్టీ కార్యాలయంలో.. ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గి శెట్టి సుజయ్ బాబు పేర్కొన్నారు.
శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మాగుంట లేఅవుట్ లో ఉన్న జనసేన నగర పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి సుజయ్ బాబు, ఆయనతో పాటు జనసేన ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్, కోవూరు నియోజకవర్గ ఇన్చార్జ్ చప్పిడి శ్రీనివాసుల రెడ్డి, గూడూరు నియోజకవర్గ ఇన్చార్జ్ మోహన్ లు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారంతా కేకు కట్చేసి సంబరాలు జరుపుకున్నారు. మహిళలను సన్మానించి వారికి చీరలు అందజేశారు. అనంతరం సుజయ్ మాట్లాడారు. నేటి సమాజంలో ఇప్పటికీ మహిళల పట్ల అసమానతలు, అణచివేత కొనసాగుతుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే విద్యా ,ఉద్యోగం , వ్యాపారం , రాజకీయాల్లో సరైన భాగస్వామ్యం అనేది తప్పనిసరి అన్నారు. సమాజంలో ఒక మహిళను బలపరిస్తే ఒక కుటుంబాన్ని బలపరుస్తుందన్నారు. ఇంకా పలు విషయాలను ఆయన వెళ్లడించారు.