నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తాం
నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలపై కఠిన చర్యలు తప్పవు
కమిషనర్ సూర్య తేజ
నెల్లూరు కార్పొరేషన్ గ్రీవెన్స్ లో అర్జీలు స్వీకరించిన కమిషనర్
దాడులు చేస్తాం…
- నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తాం
- నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలపై కఠిన చర్యలు తప్పవు
- కమిషనర్ సూర్య తేజ
- నెల్లూరు కార్పొరేషన్ గ్రీవెన్స్ లో అర్జీలు స్వీకరించిన కమిషనర్
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 120 మైక్రోన్ల కన్నా తక్కువ స్థాయి గల సింగల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ, రవాణా, విక్రయం తదితరాలను నిషేధిస్తున్నట్లు కమిషనర్ సూర్య తేజ స్పష్టం చేశారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. కార్యక్రమంలో కమిషనర్ సూర్య తేజ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. స్వర్ణాంధ్ర – 2047 లక్ష్య సాధనలో భాగంగా ప్రతినెల మూడవ శనివారం నాడు “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్” కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. క్రమం తప్పకుండా ప్లాస్టిక్ ఉత్పత్తుల దుకాణాలపై దాడులు నిర్వహిస్తామని, నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలకు భారీ స్థాయిలో జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. వేదికకు మొత్తం 66 ఫిర్యాదులు అందుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అదనపు కమిషనర్ వై.వో. నందన్, ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ. రామ్ మోహన్ రావు, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య, మేనేజర్ ఇనాయతుల్లా, విభాగాల అధికారులు, సూపరెంటెండెంట్ లు, సిబ్బంది పాల్గొన్నారు.