దేశ చరిత్రలో తొలి సారి ఒకే రోజు 105 శంఖుస్థాపనలు
ఒకే నియోజకవర్గం ఒకే రోజు వందల సంఖ్యలో అభివృద్ధి శంఖుస్థాపనలు
60 రోజుల్లో పూర్తి చేసి ప్రారంభించేలా టార్గెట్
రాష్ట్రంలోనే హాట్ టాపిగ్గా మారిన నెల్లూరురూరల్ నియోజకవర్గం
కోటంరెడ్డి ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ మంత్రి లోకేష్ ట్వీట్
కోటంరెడ్డి ఏం చేసినా చరిత్రే…!
- దేశ చరిత్రలో తొలి సారి ఒకే రోజు 105 శంఖుస్థాపనలు
- ఒకే నియోజకవర్గం ఒకే రోజు వందల సంఖ్యలో అభివృద్ధి శంఖుస్థాపనలు
- 60 రోజుల్లో పూర్తి చేసి ప్రారంభించేలా టార్గెట్
-రాష్ట్రంలోనే హాట్ టాపిగ్గా మారిన నెల్లూరురూరల్ నియోజకవర్గం - కోటంరెడ్డి ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ మంత్రి లోకేష్ ట్వీట్
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఏం చేసినా అదొక చరిత్రలో నిలిచిపోతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించిన కోటంరెడ్డి. తాజాగా మరొక రికార్డు సొంతం చేసుకున్నారు. ఒకే నియోజకవర్గంలో ఒకే రోజు 105 శంఖుస్థాపనలు చేసి రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులు దృష్టిని నెల్లూరురూరల్ వైపు మరలాచారు. శంఖుస్థాపనలు చేయడమే కాకుండా ఆ శంఖుస్థాపన చేసిన ప్రతీ పనిని 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తానని ప్రకటించడం కూడా మరొక రికార్డే అని చెప్పాలి. నిత్యం ప్రజా సేవ కోసం పరితపించే కోటంరెడ్డి శంఖుస్థాపన కార్యక్రమాన్ని గురించి రాష్ట్రమంత్రి నారా లోకేష్ స్వయంగా కోటంరెడ్డి ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేయడం నేడు రాష్ట్రంలో హాట్ టాపిగ్గా మారింది. లోకేష్ ట్వీట్లో ఏమన్నారంటే… నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారి నేతృత్వంలో ఒకే రోజు 105 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి రికార్డు సృష్టించారు. బహుశ దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టం. ఆంధ్రప్రదేశ్ లో ఎన్సీబీఎన్ గారి నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది అనడానికి ఇదొక ఉదాహారణ. ప్రజా ప్రతినిధులకు స్ఫూర్తిగా నిలిచిన ఎమ్మెల్యే కోటంరెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో నెల్లూరు రూరల్ ఆదర్శంగా నిలవనుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఉదయం 6.30 గంటల నుంచే కోటంరెడ్డి సోదరులు శంఖుస్థాపనల కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని వేలాదిమంది ప్రజలు, నాయకులు, కార్యకర్తల సమక్షంలో కోలాహలంగా జాతరను తలపించే రీతిలో సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్డులు, ముఖ్యనేతలు, ప్రజలు పాల్గొన్నారు.