కావలి బ్రిడ్జి సెంటరులో బాణా సంచ పేల్చి ఆనందోత్సవాలు
బీద రవిచంద్రకు రెండో ఎమ్మెల్సీ పదవి రావడం పట్ల హర్షం
కావలిలో కూటమి శ్రేణులు సంబరాలు
- కావలి బ్రిడ్జి సెంటరులో బాణా సంచ పేల్చి ఆనందోత్సవాలు
- బీద రవిచంద్రకు రెండో ఎమ్మెల్సీ పదవి రావడం పట్ల హర్షం
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రకు రెండో ఎమ్మెల్సీ పదవి రావడం పట్ల కావలిలో టీడీపి, జనసేన, ఆయన అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. సెంటరులో బాణా సంచ పేల్చి సంతోషాన్ని పంచుకున్నారు. 16వ వార్డు జనసేన ఇన్చార్జ్ మల్లికార్జున యాదవ్ ఈ కార్యక్రమానికి కావలి జనసేన యువ నాయకుడు సిద్దు హాజరయ్యారు. పార్టీలో ఎంతో నిబద్ధతతో పనిచేసి అధిష్ఠానం ఆశీస్సులు పొందారని ఈ సందర్భంగా సిద్దు తెలిపారు. కావలి అభివృద్ధిలో ఆయన ఎంతో కృషి చేసినట్లు చెప్పారు. మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ బీద రవిచంద్ర కు ఎమ్మెల్సీ పదవి రావడం చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన కావలి రూరల్ మండల అధ్యక్షులు తుళ్లూరు తిరుపతి స్వామి, టీడీపి, జన సైనికులు పాల్గొన్నారు.