24 గంట‌ల్లోనే రైతు ఖాతాలోకి న‌గ‌దు జ‌మ‌

సంగంలో హ‌ర్షం వ్య‌క్తం చేసిన రైతులు

24 గంట‌ల్లోనే రైతు ఖాతాలోకి న‌గ‌దు జ‌మ‌

  • సంగంలో హ‌ర్షం వ్య‌క్తం చేసిన రైతులు

నెల్లూరు జిల్లా సంగం సొసైటీలోని ధాన్యం కొనుగోలు కేంద్రం లో ధాన్యం తోలిన 24 గంటల్లో రైతు ఖాతాలోకి నగదు జమ చేయడంపై రైతు కంటాబత్తిన శ్రీహరి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. స్థానిక సొసైటీ లో కూటమి నాయకుల తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. 24 గంటల్లో అకౌంట్ లోకి నగదు జమ చేసినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కి, జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు. సహకార సిబ్బంది ఎటువంటి సమస్యలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేశారని తెలిపారు. రైతులు తప్పనిసరిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో టీడీపీ మండల అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్,సంగం సాగునీటి సంఘం అధ్యక్షుడు షేక్ బాబు,టీడీపి నాయకులు పిట్టు పట్టాభిరామిరెడ్డి,సొసైటీ సిఈఓ దస్తగిరి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *