వరికుంటపాడులో అగ్రిగోల్డ్ బాదితుల సంఘం నేతలపై దాడికి పాల్పడ్డా
కనియంపాడుకు చెందిన శ్రీకాంత్ యాదవ్ మరో 20 మంది
జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ కు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు
ఎస్సై, సీఐ, కావలి డిఎస్పీకి పిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని ఎస్పీ ముందు ఆవేదన
న్యాయం చేస్తామని ఎస్పీ హామీ
ఇంకోసారి కాలుపెడితే నరికేస్తా…!
- అగ్రిగోల్డ్ బాదితుల సంఘం నేతపై, అడ్డొచ్చిన వారిపై దాడి, వామపక్ష నేతలపై బూతుపురాణం
- వరికుంటపాడులో శ్రీకాంత్ యాదవ్ అనే వ్యక్తి మరో ఇరవై మంది రౌడీయిజం
- వరికుంటపాడు ఎస్సై సమక్షంలో ఘటన
- కావలి డిఎస్పీ శ్రీధర్ కు పిర్యాదు. న్యాయం చేయాలని విజ్ఞప్తి
- దాడిని ఖండిస్తూ మద్దతు పలికిన సీపీఎం
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో ఇంకోసారి కాలుపెడితే నరికేస్తా.. అంటూ అగ్రిగోల్డ్ బాదితుల సంఘం రాష్ట్ర నేతపై, అడ్డొచ్చిన వారిపై దాడి చేసి, అక్కడే ఉన్న వామపక్ష నేతలపై బూతుపురాణంతో శ్రీకాంత్ యాదవ్ అనే వ్యక్తి రెచ్చిపోయినట్లు బుదవారం కావలి డిఎస్పీ శ్రీధర్ కు పిర్యాదు చేశారు. ఎస్సై సమక్షంలో ఇరవై మందితో వచ్చిన శ్రీకాంత్ యాదవ్ రౌడీయిజం ప్రదర్శించడం జరిగిందని డిఎస్పీకి తెలిపారు. అనంతరం వారు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, దామా అంకయ్య మీడియాతో మాట్లాడారు. వరికుంటపాడు మండలం కనియంపాడు, బాస్కరాపురంలోని అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ కర్రను అక్రమంగా తరలిస్తున్నారన్నారు. ఇది తెలుసుకున్న తాము అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావుతో కలిసి పరిశీలనకు వెళ్లామన్నారు. తహశీల్దారు కార్యాలయంలో, పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసి తిరిగి వస్తుండగా శ్రీకాంత్ యాదవ్ అనే వ్యక్తి మరో 20 మందితో కారుల్లో వచ్చి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతయ్యపైనే దాడి చేశారన్నారు. అడ్డొచ్చిన మరో ముగ్గురుపైనా దాడి చేసినట్లు చెప్పారు. అక్కడే ఉన్న వరికుంటపాడు మండలం ఎస్సై సాక్షిగా ఈ దాడి జరిగిందని వారు తెలిపారు. ఈ దాడి ఘటనను చూస్తే అసలు ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా… సాక్షాత్తు ఎస్సై సమక్షంలో దాడి జరుగుతుంటే తాను రక్షణ కల్పించలేమని ఒక ఎస్సై చెప్పడం ఏమిటని వామపక్ష నేతలు ప్రశ్నించారు. శ్రీకాంత్ యాదవ్, అతనితో వచ్చిన వారిపై పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే ఛలో వరికుంటపాడు కార్యక్రమం చేపడతామని వారు తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నాయకుడు , సభ్యులపై జరిగిన దాడిని సీపీఎం నాయకులు ఖండించారు. వారు చేస్తున్న పోరాటానికి వ్యవసాయ కార్మిక రాష్ట్ర కమిటీ సభ్యులు మాల్యాద్రి మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు శంకరయ్య జిల్లా ప్రచార కార్యదర్శి సురేష్, రామకృష్ణ, రైతు సంఘం నాయకులు బలిజపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.