ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతే
రూ. 15వేల జీతగాళ్లకి ఫ్యాన్, ఏసీలిస్తారు
మండుటెండలో కష్టపడే రైతుని పట్టించుకోరు
రైతు ఆక్రోశం…
- ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతే
- రూ. 15వేల జీతగాళ్లకి ఫ్యాన్, ఏసీలిస్తారు
- మండుటెండలో కష్టపడే రైతుని పట్టించుకోరు
ప్రభుత్వం, ఎమ్మెల్యే, వ్యవసాయాధికారులపై నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాటూరులో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ టీడీపీ నాయకులు, రైతు లక్ష్మీశెట్టి శీనయ్య తన ఆవేదనను మీడియా ఎదుట వాపోయారు. ధాన్యం కొనుగోళ్ల గురించి మూడు నెలల నుంచి ఎమ్మెల్యేకి చెప్పామన్నారు. ప్రస్తుతం గ్రామంలో 30 శాతం కోతలు పూర్తయ్యాయని…ధాన్యం ఆరబోయమంటే పట్టలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వస్తే ఏం చేయాలని ఆయన అధికారుల్ని సూటిగా ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం వచ్చినా రైతులు బాగుపడిన పాపాన పోలేదని మండిపడ్డారు. రైతు బాధని ఆయన మాటల్లోనే విందాం….