రూ.5.80 కోట్ల‌తో లీజుదారు ప‌రార్‌

సాయిబాబా రైస్ మిల్ ఎదుట రైతులు ఆందోళ‌న‌

త‌మ‌కు న్యాయం చేయ‌క‌పోతే ఆత్మ‌హ‌త్యే శ‌ర‌ణ్యం అంటూ ఆవేద‌న

రూ. 5.80 కోట్ల‌తో లీజుదారు ప‌రార్‌…

  • సాయిబాబా రైస్ మిల్ ఎదుట రైతులు ఆందోళ‌న‌
  • త‌మ‌కు న్యాయం చేయ‌క‌పోతే ఆత్మ‌హ‌త్యే శ‌ర‌ణ్యం అంటూ ఆవేద‌న

నెల్లూరు న‌గ‌రం న‌వాబుపేట‌లోని సాయిబాబా రైస్‌మిల్ ఎదుట రైతులు ఆందోళ‌న‌కు దిగారు. త‌మకు న్యాయం చేయాల‌ని…లీజుదారు శేఖ‌ర్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు రైతులు మీడియాతో మాట్లాడుతూ… సాయిబాబా రైస్‌మిల్‌ని శేఖ‌ర్ అనే వ్య‌క్తి లీజుకి తీసుకొని న‌డిపిస్తున్నాడ‌న్నారు. త‌మ వ‌ద్ద ధాన్యం కొనుగోలు చేసి డ‌బ్బులు చెల్లించ‌కుండా నెల రోజుల నుంచి రైస్‌మిల్ చుట్టూ తిప్పుకుంటున్నాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సుమారు రూ. 5 కోట్ల 80 ల‌క్ష‌లు ఇవ్వ‌కుండా తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. ఇప్పుడు న‌గ‌దు కోసం రైస్ మిల్ వ‌ద్ద‌కు వ‌స్తే మిల్ ని క్లోజ్ చేసి గేటుకి తాళాలు వేసి లీజుదారుడు శేఖ‌ర్ ప‌రారైపోయాడ‌న్నారు. గ‌తంలోనూ రూ. 8 కోట్ల స్కాంకి పాల్ప‌డ్డాడ‌ని ఆరోపించారు. స్థానిక టీడీపీ నాయ‌కులు, పోలీసులు త‌మ‌కు న్యాయం చేయాల‌ని…లేకుంటే త‌మ కుటుంబాల‌న్నీ ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *