కుప్పంలో దొంగతనాలకు పాల్పడుతున్న గుర్తు తెలియని దుండుగులు
పట్టపగలే రెచ్చిపోతున్న దొంగలు…
- కుప్పంలో దొంగతనాలకు పాల్పడుతున్న గుర్తు తెలియని దుండుగులు
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో దొంగలు పట్టపగలే ఓ ఇంట్లో డబ్బు, బంగారం, వెండి, ఎలక్ట్రానిక్ వస్తువులు దోచుకెళ్ళినట్లు బాదితులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ గోడౌన్ వెనుక వీధిలో త్యాగరాజు, భారతీ నివాసం ఉంటున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దొంగలు తలుపులు పగలగొట్టి బెడ్ రూంలోని బీరువా, ట్రంక్ పెట్టిలో దాచుకున్న 120 గ్రాముల బంగారం, 70 గ్రాముల వెండి, 20వేల నగదుతో పాటు డెల్ ల్యాప్టాప్ ఎత్తుకెళ్ళారని త్యాగరాజు స్పష్టం చేశారు. చిరుద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని కన్నీటిపర్యంతం అయ్యారు. కుప్పం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు..