గిరిజనులు, పోలీసులు, అటవీ శాఖాధికారుల మధ్య వాగ్వాదం
డక్కిలిలో గ్రామంలో నిరసన ర్యాలీ
గిరిజనులపై దాడి సరికాదు…
- గిరిజనులు, పోలీసులు, అటవీ శాఖాధికారుల మధ్య వాగ్వాదం
- డక్కిలిలో గ్రామంలో నిరసన ర్యాలీ
డక్కిలి మండలం మోపూరు గ్రామంలో గిరిజనులపై ఫారెస్ట్, పోలీసు నిర్భంద కాండను తీవ్రంగా ఖండిస్తూ… యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెసి పెంచలయ్య ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీ చేపడుతున్న గిరిజన సంఘాల నాయకుల్ని, గిరిజనుల్ని పోలీసులు, ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న వెంకటగిరి సీఐ వెంకటరమణ ఘటనా స్థలానికి చేరుకొని గిరిజనులకి నచ్చచెప్పారు. దీంతో వారు నిరసన ర్యాలీని విరమించారు. ఈ సందర్భంగా కేసీ పెంచలయ్య మీడియాతో మాట్లాడుతూ….ఫారెస్ట్ అధికారులు తమ గిరిజనులపై అన్యాయం కేసులు బనాయించి వారిని భయబ్రాంతులకు గురి చేయడం దారుణమన్నారు. వెంటనే వారిపై కేసులు ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ నిరసనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డక్కిలి తహసీల్దార్ ఎం శ్రీనివాసులు, ఫారెస్ట్ డిఆర్ఓ ప్రతాపరెడ్డి, డిఆర్ఓ, ప్రజా సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.