వ‌న్య‌ప్రాణుల బాధ్య‌త అట‌వీ శాఖ‌దే కాదు

రేంజ‌ర్ ర‌వీంద్ర‌బాబు

రాపూరులో వ‌న్య‌ప్రాణుల దినోత్స‌వం

వ‌న్య‌ప్రాణుల బాధ్య‌త అట‌వీ శాఖ‌దే కాదు…

  • రేంజ‌ర్ ర‌వీంద్ర‌బాబు
  • రాపూరులో వ‌న్య‌ప్రాణుల దినోత్స‌వం…

ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు అటవీ రేంజ్ పరిధిలోని రేంజర్ రవీంద్రబాబు ఆధ్వర్యంలో సిబ్బందితో కలసి జాతీయ వన్యప్రాణుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మ‌ద్దెల మ‌డుగు అట‌వీ శాఖ కార్యాల‌యం నుంచి ఆర్టీసీ బ‌స్టాండ్ వ‌ర‌కు ప్ర‌చార చిత్రాలు…జాన‌ప‌ద పాట‌ల‌తో ర్యాలీ నిర్వ‌హించి ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. అనంత‌రం రేంజ‌ర్ ర‌వీంద్ర‌బాబు మాట్లాడుతూ… వన్యప్రాణులకు ఎటువంటి హాని కలిగించకూడదని, వన్యప్రాణుల బాధ్యత అటవీశాఖది మాత్రమే కాదు అని… ప్రజల కూడా బాధ్యత ఉందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్లు కాజా రసూల్, మస్తానయ్య, సెక్షన్ ఆఫీసర్లు చంద్రశేఖర్, వరప్రసాద్, చక్రపాణి, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *