మండ‌లాధ్య‌క్షురాలిపై క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు

సీఐటీయూ యూనియ‌న్ స‌భ్య‌త్వం తొల‌గింపు

మీడియా స‌మావేశంలో వింజ‌మూరు సీఐటీయూ మండ‌ల కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ రెడ్డి

మండ‌లాధ్య‌క్షురాలిపై క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు

  • సీఐటీయూ యూనియ‌న్ స‌భ్య‌త్వం తొల‌గింపు
  • మీడియా స‌మావేశంలో వింజ‌మూరు సీఐటీయూ మండ‌ల కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ రెడ్డి

సీఐటీయూ యూనియన్ లో సభ్యురాలు, ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలుగా పనిచేస్తున్న పల్లపు అరుణ అనే ఆమెపై క్రమ శిక్షణ చర్యలు తీసుకున్నామ‌ని సీఐటీయూ మండల కార్యదర్శి భాస్కర్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే ఆమె యూనియ‌న్ల‌లో స‌భ్య‌త్వం నుంచి తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న నెల్లూరు జిల్లా వింజ‌మూరులోని ఆర్అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. ఈ మధ్యకాలంలో అవగహన లేకుండా సీఐటీయూ యూనియన్ నీ, ఆశా వర్కర్స్ యూనియన్ ను నిందిస్తూ బాధ్యతరాహిత్యంగా వ్యవరిస్తున్నార‌న్నారు. ఈ కారణంగా సీఐటీయూ మండల కమిటీ ఈ నిర్ణయం తీసుకోవడం జ‌రిగింద‌న్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ గౌరవ అధ్యక్షులు కామక్షయ్య పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *