నా భర్తని కొట్టి…విద్యుత్ షాక్ ఇచ్చారు…
- కోడి పుంజు దొంగలించాడన్న నెపంతో తప్పుడు కేసులు
- న్యాయం జరిగే ఎంత దూరమైన వెళుతా – బాధితుడి భార్య
- భద్రాది కొత్తగూడెంలో అమానుషం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం స్థానిక పోలీస్ స్టేషన్లో దాసరి అప్పారావు అనే వ్యక్తి నారావారి గూడెం కి చెందిన కలపాల నాగరాజు తన కోడిపుంజును దొంగలించాడు అని స్థానిక స్టేషన్లో గత నెల 20న ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు అదనపు ఎస్సై రామ్మూర్తి నాగరాజుని స్టేషన్కి పిలిపించి 12 రోజుల నుంచి నరకం చూపించాడని బాధితుడి భార్య ఆరోపించింది. ఈ కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పిన వినకుండా చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
కోడిపుంజును దొంగలించానని ఒప్పుకోవాలని… లేకపోతే తమదైన స్టైల్ లో విచారణ చేపడతామని బూతులు తిడుతూ కరెంట్ షాక్ పెట్టి ఇష్టం వచ్చినట్లు కొట్టారని భార్య, కుటుంబ సభ్యులు వాపోయారు. తమకు న్యాయం జరిగే పోరాటం చేస్తామని హెచ్చరించారు.