అధికారులే రైతుల వద్దకు వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తారు
రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి రావూరి రాధాకృష్ణ
దళారుల్ని నమ్మి మోసపోవద్దు…
- అధికారులే రైతుల వద్దకు వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తారు
- రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి రావూరి రాధాకృష్ణ
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని… రైతుల దగ్గరకే వచ్చి అధికారులు ధాన్యం కొనుగోలు చేస్తారని రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి రావూరి రాధాకృష్ణ నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం కసుమూరు గ్రామంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించి రైతులు వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మీడియాతో మాట్లాడుతూ….గత ప్రభుత్వంలో పుట్టి వరి ధాన్యం 28,000కి అమ్ముకునేందుకు వెసులుబాటు కల్పించింది… మీ ప్రభుత్వం మా ప్రభుత్వం కాదని మార్కెట్ డిమాండ్ పైన ఆధారపడి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రావూరు రాధాకృష్ణమనాయుడు, అల్లూరు ప్రసాద్ నాయుడు, నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.