రాత్రి 12 వ‌ర‌కు షాపులు తెర‌చి ఉంచాలి

  • అందుకు అనుగుణంగా పోలీసులు చ‌ర్య‌లు చేప‌ట్టాలి
  • అధికారుల స‌మ‌క్ష‌లో మంత్రి నారాయ‌ణ

రంజాన్ మాసం 30 రోజులపాటు ముస్లిం సోదరుల అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ అధికారుల్ని ఆదేశించారు. రంజాన్ మాసం సందర్భంగా ఆయ‌న‌ నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ, ఒకగంట ముందుగా మున్సిపల్ తాగునీరు అందించడం, వీధిలైట్ల ఏర్పాటు పోలీస్ పికెటింగ్ తదితర సౌకర్యాలను తక్షణమే అందుబాటులో వచ్చే విధంగా చూడాలని మంత్రి అధికారులు ఆదేశించారు. అనంత‌రం నారాయ‌ణ మీడియాతో మాట్లాడుతూ….

రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు, ఉదయం 3 గంటలనుండే తాగునీరు అందుబాటులోకి వచ్చేలా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించామన్నారు. అలాగే ముస్లిం సోదరుల అవసరాల మేరకు వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు వీలుగా రాత్రి 12:00 వరకు షాపులు తెరిచి ఉంచాలని సూచించడం జరిగిందన్నారు. పోలీస్ అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించామ‌ని చెప్పారు. మసీదుల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ చెత్త బుట్టల ఏర్పాట్లను పర్యవేక్షించాలని చెప్పామన్నారు. ఈ స‌మీక్ష‌లో వ‌క్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, జిల్లా కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తీక్ నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ, డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్, తహసీన్, ఇతర మున్సిపల్, విద్యుత్ రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *