- మంత్రి నారాయణ
- అల్లీపురం డంపింగ్ యార్డులో చెత్తతొలగింపుకు మంత్రి శంఖుస్థాపన
రాష్ట్రంలో అప్పులే కాదని…85 లక్షల టన్నుల చెత్తని కూడా వైసీపీ ప్రభుత్వం వదిలేసి వెళ్లిపోయిందని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ఎద్దేవా చేశారు. నగరంలోని తొమ్మిదవ డివిజన్ పరిధిలో ఉన్న అల్లిపురం డంపింగ్ యార్డ్ లో చెత్త తొలగింపు కార్యక్రమానికి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనురాధలతో కలిసి మంత్రి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో చెత్తను తొలగించే కార్యక్రమం చేపట్టామన్నారు. రానున్న ఆరు నెలల్లో డంపింగ్ యార్డ్ లో పూర్తిస్థాయి చెత్త తొలగించి గ్రీనరీని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి ముఖ్య నాయకులు అధికారులు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.