స‌ర్వం సిద్ధం

సీసీ కెమెరాల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు

కోట బీఆర్ అంబేద్క‌ర్ గురుకులం సెంట‌ర్ చీఫ్ ఏ వెంక‌టేశ్వ‌ర్లు

స‌ర్వం సిద్ధం…

  • సీసీ కెమెరాల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు
  • కోట బీఆర్ అంబేద్క‌ర్ గురుకులం సెంట‌ర్ చీఫ్ ఏ వెంక‌టేశ్వ‌ర్లు

మార్చి 1 నుంచి జ‌ర‌గ‌బోయే ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల‌కు తిరుప‌తి జిల్లా కోట మండ‌లం డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ గురుకులం బాయ్స్ స్కూల్ లో అన్నీ ఏర్పాట్లు సిద్దం చేశామ‌ని ఆ సెంట‌ర్ చీఫ్ సూప‌రింటెండెంట్ ఏ వెంక‌టేశ్వ‌ర్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌రీక్షా కేంద్రాల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం వెంక‌టేశ్వ‌ర్లు ఎన్‌3 న్యూస్‌తో మాట్లాడారు. ఫ‌స్ట్ ఇయ‌ర్ 369 మంది, సెకండ్ ఇయ‌ర్ 288 మంది మొత్తం 657 మంది విద్యార్థులు ప‌రీక్ష‌లు రాస్తున్నార‌న్నారు. వీరంద‌రికి ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప‌రీక్షా కేంద్రాల్లో అన్నీ వ‌స‌తులు ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. మొత్తం 16 రూమ్‌ల‌ను ఏర్పాటు చేశామ‌ని…అన్నింట్లోనూ సీసీ కెమెరాల నిఘాలో ప‌రీక్ష‌లు జ‌రుగుతాయ‌న్నారు. ప‌రీక్షా కేంద్రానికి గంట ముందే విద్యార్థులు చేరుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *