సంగంలోని పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన CI వేమారెడ్డి

పక్కాగా 144 సెక్షన్ అమలు

సంగంలోని పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన CI వేమారెడ్డి

-పక్కాగా 144 సెక్షన్ అమలు

సంగం లోని బాలికల గురుకుల పాఠశాల వద్ద ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షా కేంద్రాన్ని సీఐ వేమారెడ్డి ,ఎస్సై రాజేష్ సందర్శించారు. పరీక్ష కేంద్రం వద్ద ఏర్పాట్ల ను పరిశీలించారు. విద్యార్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రంలోని తీసుకెళ్లకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. 144 సెక్షన్ అమలు తీరు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్ర వద్ద విద్యార్థులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. 144 సెక్షన్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *