వారి బ‌లిదాన‌మె మా విజ‌యం.

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ పై మాదిగ‌లు

నెల్లూరు జిల్లాలో ఎమ్మార్పిఎస్ నాయ‌కులు ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ పోరాటాన్ని ముమ్మ‌రం చేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి సుదీర్ఘ 30 సంవత్సరాల కాలంలో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ప్రాణ త్యాగాలు చేసీన‌ అనేక మంది మాదిగ బిడ్డల ఆత్మ బ‌లిదాన‌మె నేడు మా జాతి అందుకోబోతున్న ఎస్సీ వర్గీకరణ ఫలితాలంటు.. నెల్లూరు జిల్లా రాపూరు మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఎంఎస్ పి ఇంచార్జ్ చింతగుంట అంకయ్య మాదిగ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ పోరాట ఉద్యమంలో అమరులైన మాదిగ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాదిగ జాతి పోరాటంలో అసులుబాసిన అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి చింతగుంట అంకయ్య మాదిగతొ పాటు మంగళపూరి వెంకటేష్, పామర్తి ఆశీర్వాదం, తాడి రాజా, ఏసుపోగు పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *