ఎప్పుడు.. ఏ.. అవసరం ఉన్నా.. తనకే ఫోన్చేసి మాట్లాడొచ్చు
సమీక్షా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి
రంజాన్ను మరపురాని జ్ఞాపకంగా విజయవంతం చేయాలి
-రంజాన్ మాసంలో మసీదులవద్ద పక్కా ఏర్పాట్లు చేయాలి
-ఎప్పుడు.. ఏ.. అవసరం ఉన్నా.. తనకే ఫోన్చేసి మాట్లాడొచ్చు
-సమీక్షా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి
రంజాన్ మాసం ప్రారంభం కాబోతుంది.. ఎక్కడా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ముస్లీం మత పెద్దలు, కార్పోరేషన్ అధికారుల సమన్వయంతో ఈ పర్వదినాన్ని అందరికీ మరపురాని జ్ణాపకంగా విజయవంతం చేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కోరారు. ఈమేరకు శుక్రవారం రాత్రి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో మసీదులవద్ద ఏర్పాట్లపై ముస్లీం పెద్దలు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ రంజాన్కు ఎలాంటి ఆటంకాలు లేకుండా.. పక్కా ఏర్పాట్లతో నిర్వహించేందుకు అందరి వద్ద నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఎమ్మెల్యే సైతం ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మసీదుల వద్ద శానిటేషన్, లైటింగ్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఈ విషయమై సంబంధిత అధికారులతో కూడా మాట్లాడానన్నారు. ముస్లిం సోదరులకు ఎప్పుడు.. ఏ అవసరం ఉన్నా.. నేరుగా తనకే ఫోన్ చేసి తెలియజేయాలని ఈసందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కోరారు. అనంతరం మైనారిటీ నాయకులు మాట్లాడారు. తర్వాత అందరూ కలసి శ్రీధర్రెడ్డిని ఘనంగా శాలువాలతో సత్కరించారు