సంగం లోని బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు
సంగం గురుకుల పాఠశాలలో ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు
సంగం లోని బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.విద్యార్థులు అర్ధగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకుని గదుల నంబర్లు చూసుకుని..పరీక్షా కేంద్రం లోకి వెళ్లారు. విద్యార్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లకుండా క్షుణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. పరీక్షా కేంద్రం వద్ద ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ లు బందోబస్తు ఏర్పాటు చేశారు.