ఆయన ఇల్లే ఓ కషాయాల కర్మాగారం
వ్యవసాయ రేడియో పాఠాలే వెంకయ్యకు స్ఫూర్తి
29 ఏళ్లుగా సేంద్రియ పద్ధతుల్లో వరిపంట సాగు
తక్కువ పెట్టుబడితో నాణమైన దిగుబడులు
ఎవరు గుర్తించినా.. గుర్తించకపోయినా ఆయన ధ్యేయం ప్రకృతి సేద్యమే..
ఆదర్శంగా నిలుస్తున్న రైతన్న కరేటి వెంకయ్య, ఆయన సతీమణి శారద..
ప్రకృతి సేద్యంలో రారాజు..
కరేటి వెంకయ్య
- ఆయన ఇల్లే ఓ కషాయాల కర్మాగారం
- వ్యవసాయ రేడియో
పాఠాలే వెంకయ్యకు స్ఫూర్తి - 29 ఏళ్లుగా సేంద్రియ పద్ధతుల్లో వరిపంట సాగు
- తక్కువ పెట్టుబడితో నాణమైన దిగుబడులు
- ఎవరు గుర్తించినా.. గుర్తించకపోయినా ఆయన ధ్యేయం ప్రకృతి సేద్యమే..
- ఆదర్శంగా నిలుస్తున్న రైతన్న కరేటి వెంకయ్య, ఆయన సతీమణి శారద..
తినే తిండి నుంచి తాగే నీటి వరకు నేడు అంతా కలుషితమే. వ్యాపార లాభాపేక్షతో పంటల సాగు పద్ధతులు పూర్తిగా రసాయన మయం అయ్యాయి. భోజనం చేసిన వెంటనే కడుపు మంట, అల్సర్లు,గ్యాస్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. తినే ఆహార పదార్థాలను రసాయనాలతో పండిస్తుండడంతోనేనని, మానవాళికి పొంచి ఉన్న ప్రమాదాన్ని ప్రభుత్వాలు గుర్తించాయి. ఇందుకోసం రైతులను ప్రకృతి సేద్యం వైపు మళ్లించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయానికి
పెద్ద పీఠనేవేస్తూ బడ్జెట్ లో నిధులు కేటాయిస్తున్నారు. నేడు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్న ఈ ప్రకృతి సేద్యానికి ఎప్పుడో కనెక్ట్ అయ్యాడు మనరైతన్న కరేటి వెంకయ్య. తోటి రైతులు హేళన చేస్తున్నా, దిగుబడులు తక్కువుగా వస్తున్నా ఏ రోజు కుంగిపోకుండా ప్రకృతి వ్యవసాయాన్నే కొనసాగిస్తున్నాడు. ఈ వ్యవసాయం చేసేందుకు వెంకయ్య ఎలా స్ఫూర్తి పొందాడు..? ఆ వ్యవసాయం ఎలా చేస్తున్నాడు…? ఆయనకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉందా..? ఈ సేద్యంలో ఆయన ఆలోచనలు, చేసే పద్ధతులు తెలుసుకోవాలంటే ఎన్ త్రీ న్యూస్ చూడాల్సిందే..
నెల్లూరు జిల్లా కావలి మండలం మన్నంగిదిన్నెకు చెందిన కరేటి వెంకయ్య తన భార్య శారద సహకారంతో ప్రకృతి సేద్యం చేస్తున్నాడు. 29 ఏళ్ల కిందట రేడియో పాఠాల ద్వారా స్ఫూర్తిపొంది అప్పటి నుంచి సేంద్రియ పద్ధతుల్లోనే వరి పంటను పండిస్తున్నాడు. ఇందుకు ఆయన తన ఇంటినే
కాషాయాల కర్మాగారంలా మార్చేశాడు. పంటకు దుక్కిలో వేసే ఎరువు నుంచి పంటలను ఆశించే తెగుళ్లు, పురుగులు, దోమల నివారణకు, పంట పెరుగుదలకు పిచికారీ కషాయాలను స్వయంగా
తయారు చేసుకుంటున్నాడు.
ఇందుకోసం ఆవు మూత్రం, నెయ్యి, వేప గింజలు, ఉమ్మెత్త పువ్వులు, వాయిల ఆకులు, సీతాఫలం ఆకులు, తెల్లగడ్డలు, అల్లం, కల్లు, టెంకాయ నీళ్లు, కోడి గుడ్ల పెంకులు, బెల్లం వంటి ముడి సరుకులతో పంచగవ్య, బ్రహ్మాస్త్రం,అగ్నిహస్త్రం పేర్లతో
కాషాయాలను తయారు చేస్తున్నాడు. అంతేకాకుండా లింగాకర్షణ బుట్టల ఏర్పాటు, పక్షి గూళ్ళు, పురుగుల సాంద్రత తెలుసుకునేందుకు జిగురు బోర్డులు తాను సాగుచేసే పోలాల్లో ఏర్పాటు చేస్తూ పక్కాగా సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. వెంకయ్య ఈ ఏడాది తన మూడు ఎకరాల్లో షుగర్ లెస్, జిలకర మసూర, ఇంద్రవంటి వంగడాలను సాగుచేశారు. తోటి రైతులు రసాయన ఎరువులతో ఎకరాకు 4 పుట్లు వంతున ధాన్యం దిగుబడిని చూస్తున్నారు. వెంకయ్య చేస్తున్న సేంద్రియ వ్యవసాయం ద్వారా ఎకరాకు 2 రెండు పుట్లు మాత్రమే దిగుమతి వస్తుంది. అయినా ఎక్కడా కుంగిపోకుండా ప్రకృతి వ్యవసాయాన్నె వెంకయ్య కొనసాగిస్తున్నాడు. ఇందుకోసం వెంకయ్య భార్య శారదతో కలిసి ఎంతో శ్రమతో కూడిన సేద్యం చేస్తూనే ఎక్కడా వెనకడుగు వేయలేదు. ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళని ఎంతో ప్రోత్సహిస్తుంది. ఎన్నో రాయితీలు అందిస్తున్నారు కానీ వెంకయ్య వాటికోసం ఏనాడు వెంపర్లాడలేదు. వ్యవసాయ అధికారులు అసలైన ప్రకృతి వ్యవసాయం చేసేవారిని గుర్తించకుండా డూప్లికేట్ రైతులకే రాయితీలు అందిస్తున్నారు. ఇలాంటి ప్రకృతి వ్యవసాయం చేసే కరేటి వెంకయ్యను గుర్తించక పోవడం చాలా బాధాకరమని పలువురు వాపోతున్నారు. అయినా వెంకయ్య పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్నారు. వారి గుర్తింపే నాకు ఎంతో మనోధైర్యాన్ని అందిస్తున్నట్లు వెంకయ్య చెప్పారు. ఈ వ్యవసాయం చేయడంలో తన భార్య శారద సహకారం మరువలేనిదని చెప్పారు. ఈ సందర్భంగా తన ప్రకృతి వ్యవసాయ కాషాయాల తయారీ, వాటి ఉపయోగాలు N3 న్యూస్ ద్వారా వెంకయ్య వివరించారు.