79 సెంటర్లు-53,200 మంది విద్యార్థులు
సీసీ కెమెరాల నిఘాలో పరీక్షా కేంద్రాలు
ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు
నెల్లూరులో 144 సెక్షన్…
- 79 సెంటర్లు-53,200 మంది విద్యార్థులు
- సీసీ కెమెరాల నిఘాలో పరీక్షా కేంద్రాలు
- ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు
నెల్లూరు జిల్లాలో శనివారం ఉదయం 9 గంటలకి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షకి గంట ముందుమే కేంద్రానికి చేరుకోవాలన్న అధికారుల ఆదేశాలతో…విద్యార్థినీ విద్యార్థులు పరుగులు తీశారు. జిల్లాలో 53,200 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రథమ సంవత్సరంలో 28,176 మంది, ద్వితీయ సంవత్సరం: 25,024 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ కి హాజరవుతారని చెప్పారు. జిల్లాలో 79 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్షల కోసం 1400 మంది ఇన్విజిలేటర్ల అధికారులు నియమించారు. అలాగే 5 సిట్టింగ్ స్వ్కాడ్లు, 4 ఫ్లైయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. నెల్లూరులోని పరీక్షా కేంద్రాల వద్ద పరిస్థితి ఎలా ఉందో n3 న్యూస్ లో చూద్దాం….