110 ఎకరాల్లో…10.4 మిలియన్ల నాణ్యత లేని వెనామీ సీడ్
రూ.3.5 కోట్లు నష్టపోయామంటున్న ఐదు మంది రైతులు
మత్స్యశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన
కలెక్టర్ పరిశీలించి న్యాయం చేయాలని వాపోయిన రైతులు
నాణ్యత లేని సీడ్…. హేచరీ నిర్లక్ష్య వైఖరి…
-110 ఎకరాల్లో…10.4 మిలియన్ల నాణ్యత లేని వెనామీ సీడ్
-రూ.3.5 కోట్లు నష్టపోయామంటున్న ఐదు మంది రైతులు
-మత్స్యశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన
-కలెక్టర్ పరిశీలించి న్యాయం చేయాలని వాపోయిన రైతులు
ఆక్వా రంగానికి పేరుగాంచిన నెల్లూరు జిల్లాలో నాణ్యతలేని రొయ్యల సీడ్ కారణంగా రైతులు నరకం చూస్తున్నారు. జిల్లాలో రొయ్యల సాగు విషయం ఎలా ఉన్నా నాణ్యత లేని సీడ్ రైతులకు అంటకట్టి పబ్బం గడుపుకొంటున్న హేచరీ నిర్వాహకుల స్వార్థం ఆక్వా రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతోంది. నిత్యం జిల్లాలో ఏదొక ప్రాంతంలో నాణ్యత లేని వెనామీ సీడ్ బాధిత రైతులు దగాకు గురవుతూనే ఉన్నారు.
పార్ట్-2
ఒక్కో రైతుది ఒక్కో రకం సమస్య….అయితే తాజాగా నెల్లూరు జిల్లా… ముత్తుకూరు మండలం పోలంరాజుగుంట, వెంకటాచలం మండలం నిడిగుంటపాలెం గ్రామాలకు చెందిన రైతులది మరొక వింత సమస్య, లక్షల రూపాయలు కట్టి రొయ్య పిల్లలు తెచ్చి పాండ్స్ లో వేస్తే రెండు నెలలు పూర్తి అయిన ఎదుగుదల లేకపోవడంతో నిండా మునిగిపోయారు ఆ రైతులు
పార్ట్ -3
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని ఓ హేచరీలో ముప్పై పైసలు లెక్కన పది పాయిట్ నాలుగు మిలియన్లు అంటే సుమారు ఒక్క కోటి నలబై లక్షల రొయ్య పిల్లలు కొనుగోలు చేసిన ఐదు మంది రైతులు… నెలలు గడుస్తున్నా ఆ రొయ్యల ఎదుగుదల లేకపోవడంతో ఈరోజు హార్వెస్ట్ చేశారు. ఒక గ్రాము నుంచి మూడు గ్రాముల వరకు ఉన్న రొయ్యలను చూసి నెత్తి నోరు బాదుకుంటున్నారు.
పార్ట్-4
సమస్యను గుర్తించి హేచరీ యాజమాన్యానికి కొద్ది రోజుల క్రితం సమాచారం ఇస్తే మళ్ళీ నాణ్యత లేని సీడ్ అంటగట్టేందుకు చూస్తున్నారని, మత్స్యశాఖ అధికారులకు చెబితే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని… జిల్లా కలెక్టర్ తమ గోడు పట్టించుకుని న్యాయం చేయాలని… తమలా ఏ ఆక్వా రైతు మోసపోకుండా హేచరీ పై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.