ఏడాది నిరీక్షణకు నేడు పరిక్ష కానుండటంతొ ఇంటర్ మెదటి సంవత్సరం విద్యార్దుల్లో హడావిడి
ఏడాది నిరీక్షణకు నేడు పరిక్ష కానుండటంతొ ఇంటర్ మెదటి సంవత్సరం విద్యార్దుల్లో హడావిడి కనిపించింది. మార్చి ఒకటి నుండి 19 వరకు జరగనున్న ఇంటర్ మెదటి సంవత్సరం పరిక్షలలొ నేడు మెదటి పరిక్ష కావడంతొ మెదటి రోజు విద్యార్దులు ఆయా సెంటర్లకు గంట ముందే చేరుకున్నారు. ట్రాఫిక్ సమస్య, మెదటి రోజు సెంటర్లు వెతుకోవడం, సెంటర్లలోని రూమ్స్, రూమ్స్ లోని వారికి కేటాయించిన నెబర్ల వంటి మెదటి రోజు సమస్యలు ఉండటంతొ విద్యార్దుల్లో ఉరుకులు, పరుగులు కనిపిచాయి. తిరుపతి జిల్లాలోని నాయుడుపేట పట్టణంలోని మూడు పరిక్ష కేంద్రాల వద్దా పరిక్ష రాసే విద్యార్దులతొ పాటు వారి తల్లితండ్రుల హడావిడి కనిపించింది. విద్యార్దులకు తల్లితండ్రుల ఆల్ ది బెస్ట్ విషస్ చెప్పి వారిలొ ఆత్మస్థైర్యాన్ని నింపి పరిక్ష కేంద్రాల్లోకి సాగనంపారు. పరిక్ష కేంద్రాల వద్దా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేసారు. అయితె అంబెద్కర్ గురుకుల పాఠశాల వద్ద మాత్రం ఇన్ టైంలొ గేట్లు తీయకపోవడంతొ రోడ్డు మీదే విద్యార్దులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతొ ట్రాఫిక్ జామ్ అయ్యి వెనబడిన విద్యార్దులు పరిక్ష కేంద్రానికి చేరుకోవడానికి కాస్త ఆలస్యం అయినప్పటికి ఇన్ టైంలొ చేరుకోవడంతొ విద్యార్దుల తల్లితండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.