Month: February 2025

గూడూరులో మంచు సోయగాలు…
దట్టమైన పొగ మంచుతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు తిరుపతి జిల్లా గూడూరుని ఆదివారం దట్టమైన పొగ మంచు కప్పేసింది. దట్టమైన పొగ మంచుతో రహదారులు సక్రమంగా కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా జాతీయ రహదారిపై పొగ మంచు కమ్మేయడంతో….ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. మరో వైపు పట్టణంలో మంచు సోయగాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

బీజేపీ దిగజారుడుతనానికి ఇదే నిదర్శనం
సీడబ్ల్యూసీ శాశ్వత సభ్యుడు కొప్పుల రాజు నెల్లూరు ఇందిరాభవన్లో జై భీమ జై బాపు జై సంవిధాన్ 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిని సమైక్యంగా ఉంచిన ఘనత రాజ్యాంగందేనని..అటువంటి రాజ్యాంగాన్ని ప్రసాదించిన రాజ్యాంగ నిర్మాతలను అగౌరవంగా, హేళనగా పార్లమెంట్లో మాట్లాడడం బిజెపి దిగజారుడుతనానికి నిదర్శనమని సీడబ్ల్యూసీ శాశ్వత సభ్యుడు కొప్పుల రాజు అన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు…నెల్లూరులోని ఇందిరాభవన్లో డిసిసి అధ్యక్షుడు దేవకుమార్ రెడ్డి అధ్యక్షతన జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు….

భూములివ్వం తెగేసి చెప్పిన రైతులు
కావలి మండలం చెన్నై పాలెం లో భూసేకరణ గ్రామసభ గ్రామ సభకు హాజరైన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, కావలి ఆర్డీవో, తహసిల్దారు. అధికారులు మాట్లాడుతుండగానే గ్రామస్థులు నిరసన మాకు అభివృద్ధి వద్దు… పరిశ్రమలు వద్దు… ఉద్యోగాలు అంతకంటే వద్దు… మా బతుకులు మేము బతుకుతామని…మా జీవితాలు నాశనం అయ్యేలా అధికారులు నిర్ణయాలు తీసుకోవద్దని కోరుతున్నారు కావలి మండలం ఆనెమడుగు గ్రామస్థులు. రామాయపట్నం కోర్టు అనుసంధానంగా స్థాపించే పరిశ్రమల కోసం గ్రామంలో భూసేకరణకు కావలి ఆర్డీవో వంశీ కృష్ణ…

చెత్త సంపద కేంద్రాలను అభివృద్ధి పరుస్తాం
ఈవోపీఆర్డీ భార్గవి సీతారామపురంలో చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించిన ఈవోపీఆర్డీ మండలంలోని అన్ని చెత్త సంపద కేంద్రాలను అభివృద్ధిపరచి వర్మీకంపోస్టు తయారీ ప్రారంభించడం జరుగుతుందని ఈవోపిఆర్డి భార్గవి అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం గ్రామ సచివాలయం1 పరిధిలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని ఈవోపిఆర్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం ద్వారా ఎరువులు తయారు చేస్తే, సేంద్రియ ఎరువులుగా ఉపయోగపడతాయని అన్నారు. గ్రామాల్లో ఇంటింటా ఉత్పత్తయ్యే…

కందుకూరులో చంద్రోత్సాహం
స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు గ్రామస్థులతో ఆప్యాయంగా గడిపిన సీఎం సీఎం చంద్రబాబు పర్యటన నెల్లూరు జిల్లా విజయవంతం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్చాంధ్ర ,స్వచ్చ దివస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గానికి విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎంకి జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అపూర్వ స్వాగతం పలికారు. ఎటువంటి ఆర్భాటాలకు తావు లేకుండా సామాన్య వ్యక్తిలా రాష్ట్ర ముఖ్యమంత్రి తమ గ్రామం నలుచెరుగులా పర్యటించడంతో గ్రామస్తులు…

23 కేజీలు దొరికినా….ఎందుకు ప్రెస్మీట్ పెట్టలేదు
పోలీసుల్ని సూటిగా ప్రశ్నించిన నేదురుమల్లి 300 గ్రాముల గంజాయి దొరికితేనే ప్రెస్మీట్ పెట్టే పోలీసులు…23 కేజీల గంజాయి దొరికినా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదో చెప్పాలని….పోలీసుల్ని తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వవయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వెంకటగిరి మండలంలోని ఎన్జేఆర్ భవన్లో ఆయన స్థానిక వైసీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. అధికారులకి తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశారు. తప్పు చేస్తున్నారని, తప్పు చేసిన వారు…

నెల్లూరులో బర్డ్ ఫ్లూ పరిస్థితి ఏంటంటే
రాష్ట్ర వ్యాప్తంగా కలవరపెడుతున్న బర్డ్ ఫ్లూ తెలంగాణాలో ఆంధ్రా కోళ్లకు నో ఎంట్రీ మరీ నెల్లూరులో పరిస్థితి ఏంటి….N3 గ్రౌండ్ రిపోర్ట్ బర్డ్ ఫ్లూ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా వినిపిస్తోన్న ఓ జబ్బు పేరు. ఇది సోకేది కోళ్లకే అయినా మనుషులు మాత్రం ఈ పేరు వింటే బెంబేలెత్తిపోవాల్సిందే. ముక్క లేనిదే ముద్ద దిగదు…అనే వారికి కూడా మింగుడు పడని వార్త ఇది. ఆంధ్రప్రదేశ్లో తూర్పు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ తదితర జిల్లాలలో బర్డ్…

నాడు 140..నేడు 17వేల మంది
26 ఏళ్ల కృష్ణ చైతన్య కాలేజీ ప్రస్థావనపై పర్వతరెడ్డి భావోద్వేగం ఘనంగా కృష్ణ చైతన్య ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ వార్షికోత్సవ వేడుకలు నాడు 140..నేడు 17వేల మంది తమ కృష్ణ చైతన్య ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ ని 140 మంది విద్యార్థులతో ప్రారంభించి…నేడు 17వేల మందికి ఉన్నతమైన విద్యను అందిస్తున్నామని…దిగ్విజయంగా 26 ఏళ్లు పూర్తి చేసుకున్నామని… కృష్ణ చైతన్య కాలేజీ ప్రస్థావనపై…కళాశాల డైరెక్టర్ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. నెల్లూరులోని అనిల్ గార్డెన్స్ లో… కృష్ణ చైతన్య ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్…

తిరుమలలో మరో అపశృతి
47వ లడ్డు కౌంటర్లో అగ్ని ప్రమాదం తిరుమలలో మరో అపశృతి చోటు చేసుకుంది. 47వ నెంబర్ లడ్డూ కౌంటర్లోని యూపీఎస్లో షార్ట్ సర్క్యూట్ రావడంతో మంటలు వ్యాపించాయి. దీంతో కౌంటర్ అంతా పొగ అలుముకుంది. ఈ ఘటనతో భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులో తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. మొన్న తొక్కిసలాట…నేడు లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదంతో చర్చనీయాంశంగా మారింది.