
పోలీసులు రారు…చోరీలు ఆగవు
పొంగూరులోని పోలేరమ్మ ఆలయంలో వరుస చోరీలు భయాందోళనలో గ్రామస్థులు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరులోని పోలేరమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని హుండీలో ఉన్న నగదును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. గతంలోనూ ఇదే ఆలయంలో చోరీ జరిగినట్లు స్థానికులు తెలిపారు. వరుస చోరీలు జరుగుతున్నా…పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరుస చోరీలు జరుగుతుండడంతో గ్రామస్థులు భయాందోళనకు చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి…చోరీలను అరికట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.