మీరెవ‌రు చెప్పేదానికి…?

పోలీసుల తీరుపై భ‌క్తులు ఆగ్ర‌హం

కృష్ణ‌ప‌ట్నం బీచ్ లో స‌ముద్ర స్నానాల‌కి అనుమ‌తి లేదు

పోలీసుల హెచ్చ‌రిక‌లు

మీరెవ‌రు చెప్పేదానికి…?

  • పోలీసుల తీరుపై భ‌క్తులు ఆగ్ర‌హం
  • కృష్ణ‌ప‌ట్నం బీచ్ లో స‌ముద్ర స్నానాల‌కి అనుమ‌తి లేదు
  • పోలీసుల హెచ్చ‌రిక‌లు

మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినాన స‌ముద్ర స్నానం ఆచ‌రిస్తే పుణ్యం క‌లుగుతుంద‌ని శివ భ‌క్తుల న‌మ్మ‌కం. ఈ నేప‌థ్యంలో మ‌హాశివ‌రాత్రి రోజున స‌ముద్ర తీరం వ‌ద్ద శైవ క్షేత్రాల్లో రాత్రి జాగారాలు చేసి…తెల్ల‌వారుజామున స‌ముద్ర తీరంలో స్నానాలు చేసి శివ‌య్య‌కి భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజ‌లు చేస్తారు. దీంతో నెల్లూరులోని ముత్తుకూరు మండ‌లం కృష్ణ‌ప‌ట్నం స‌ముద్ర తీరంలో స్నానాలు ఆచ‌రించేందుకు జిల్లా న‌లుమూల‌ల నుంచి కుటుంబ స‌మేతంగా పెద్ద సంఖ్య‌లో బీచ్‌కు త‌ర‌లివ‌స్తున్నారు. ఫ్యామిలీతో స‌ర‌దాగా స‌ముద్రంలో స్నానాలు ఆచ‌రిస్తూ…ఎంజాయ్ చేస్తున్నారు. ఏమైందో ఏమో తెలియ‌దు కానీ…స‌డ‌న్‌గా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. బీచ్‌లో స్నానాల‌కి అనుమ‌తి లేద‌ని…ఇక్క‌డ నుంచి వెంట‌నే వెళ్లిపోయావాల‌ని పోలీసులు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఇదెక్క‌డి న్యాయం అంటూ ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ విష‌యాన్ని కొంద‌రు భ‌క్తులు ఎన్‌3 న్యూస్ ప్ర‌తినిధికి స‌మాచారం అందించారు. తామంతా భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో బీచ్‌లో స్నానాలు చేసేందుకు వ‌స్తే…వెంట‌నే ఇక్క‌డ నుంచి వెళ్లిపోవాల‌ని పోలీసులు హెచ‌ర్చించ‌డం ప‌ట్ల పోలీసుల తీరు స‌రిగా లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అస‌లు కార‌ణం చెప్ప‌కుండా…ఇక్క‌డ నుంచి వెళ్లిపోమ‌న‌డానికి పోలీసుల‌కి ఏం హ‌క్కు ఉందంటూ ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఇది క‌రెక్ట్ కాద‌ని.. భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీయ‌వ‌ద్ద‌ని అన్నారు. ఇక చేసేదేమీ లేక అక్క‌డ నుంచి నిరాశ‌తో వెనుతిరిగి వెళ్లిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *