మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

వీపీఆర్ నివాసంలో 16 మంది ల‌బ్ధిదారుల‌కి PMAJAY చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం

  • ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
  • వీపీఆర్ నివాసంలో 16 మంది ల‌బ్ధిదారుల‌కి PMAJAY చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా టిడిపి కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. నెల్లూరు మాగుంట లే అవుట్ లోని విపిఆర్ నివాసంలో కోవూరు నియోజకవర్గ పరిధిలో“ప్రధానమంత్రి అను సూచిత్ జాతి అభ్యుదయ యోజన” (PMAJAY) పథ‌కం ద్వారా ఎంపిక అయిన 16 మంది ఎస్సీ సోదర సోదరీమణులకు 35 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ… సామాజికంగా వెనుకబడ్డ ఎస్సీ సోదర సోదరీమణులను ఆర్ధికంగా ఆదుకునేందుకు కేంద్రంలోని కూటమి ప్రభుత్వ సహకారంతో రాష్ట ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పధకాలు చేపట్టిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని ఆచరణలో నిరూపిస్తున్నారని ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పిడి నాగరాజకుమారి, పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, టిడిపి మండల నాయకులు, నియోజకవర్గ పరిధిలోని వెలుగు సిసిలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *