మహాశివరాత్రిని పురస్కరించుకొని పీఆర్ మిత్ర మండలి ఏర్పాటు
నెల్లూరు డైకస్ రోడ్డులో నిరుపేదలకు అన్నదానం
సేవ చేసేందుకే పీఆర్ మిత్ర మండలి…
- మహాశివరాత్రిని పురస్కరించుకొని పీఆర్ మిత్ర మండలి ఏర్పాటు
- నెల్లూరు డైకస్ రోడ్డులో నిరుపేదలకు అన్నదానం
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని….నెల్లూరు నగరం డైకస్ రోడ్డు సెంటర్లో….పీఆర్ మిత్ర మండలి సేవా సంస్థని మిత్ర బృందం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సురేంద్ర సహకారంతో… శివరాత్రి సందర్భంగా నిరుపేదలకు అన్నదానం చేశారు. పేదలకు సేవా చేయాలన్న మంచి ఉద్దేశంతో… పండుగ రోజున పీఆర్ మిత్ర మండలిని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని మిత్ర బృందం పేర్కొంది. రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలు చేసేందుకు తమ కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్ మిత్ర మండలి సభ్యులు…వినోద్, వేణు, విజయ్, మాబాషా, తరుణ్, గోపీ, అనిల్ తదితరులు పాల్గొన్నారు.