కుంభ‌మేళ త‌ర్వాత‌ తొలిసారి వ‌చ్చిన మ‌హాశివ‌రాత్రి

శ్రీ కామాక్షి సమేత మల్లి ఖార్జున స్వామి ఆలయంలో ప్ర‌త్యేక పూజ‌లు

భ‌క్తుల‌కు ప్ర‌సాదాలు, మంచినీటి స‌దుపాయం క‌ల్పించిన శివాజీయూత్‌పౌండేష‌న్‌, అంజ‌నా ఇన్‌ఫ్రా

కుంభ‌మేళ త‌ర్వాత‌ తొలిసారి వ‌చ్చిన మ‌హాశివ‌రాత్రి

  • శ్రీ కామాక్షి సమేత మల్లి ఖార్జున స్వామి ఆలయంలో ప్ర‌త్యేక పూజ‌లు
  • భ‌క్తుల‌కు ప్ర‌సాదాలు, మంచినీటి స‌దుపాయం క‌ల్పించిన శివాజీయూత్‌పౌండేష‌న్‌, అంజ‌నా ఇన్‌ఫ్రా

నెల్లూరు రూర‌ల్ ప‌రిధి వెంక‌ట‌రెడ్డిన‌గ‌ర్‌లోని శ్రీ కామాక్షి సమేత మల్లి ఖార్జున స్వామి ఆలయంలో మ‌హాశివ‌రాత్రి వేడుక‌లు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగాయి. వేకువ‌జాము నుంచే భ‌క్తులు ఆల‌యానికి విచ్చే శివ‌లింగానికి అభిషేకాలు నిర్వ‌హించారు. శ్రీ కామాక్షి సమేత మల్లి ఖార్జున స్వామి వార్ల‌కు ప్ర‌త్యేక అలంక‌ర‌ణ చేసి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌భాగ్యం క‌ల్పించారు. అనంతరం ఆలయ అర్చక స్వాములు భ‌క్తుల‌కు వేద ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అంద‌జేశారు. శివ‌రాత్రి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని శివాజీయూత్ పౌండేష‌న్‌, అంజ‌నా ఇన్‌ఫ్రా సంయుక్త ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. హ‌ర హ‌ర మ‌హాదేవ శంబోశంక‌ర అంటూ స్వామివారి ద‌ర్శించుకున్నారు. ప్ర‌తి ఏడాది మాదిరిగానే ఈ సంవ‌త్స‌రం కూడా శివ‌రాత్రి రోజున భ‌క్తుల‌కు ప్ర‌సాదాలు అంద‌జేసి మంచినీటి స‌దుపాయం క‌ల్పించారు. ఈ సంద‌ర్భంగా శివాజీయూత్ ఫౌండేష‌న్ ఛైర్మ‌న్ డాక్ట‌ర్ మోపూరు భాస్క‌ర్‌నాయుడు మాట్లాడుతూ అత్యంత ప‌విత్ర‌మైన కుంభ‌మేళ అనంత‌రం తొలిసారి వ‌చ్చిన శివ‌రాత్రి వేడుక‌ల‌ను శ్రీ కామాక్షి సమేత మల్లి ఖార్జున స్వామి ఆల‌యంలో ఘ‌నంగా నిర్వ‌హించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. త‌మ‌వంతుగా ప్ర‌తి ఏడాది లాగానే ఈ సంవ‌త్స‌రం కూడా భ‌క్తుల‌కు ప్ర‌సాదాలు, మంచినీటి స‌దుపాయం క‌ల్పించిన‌ట్లు చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య నిర్వాహ‌కులు, క‌మిటీ స‌భ్యులతో పాటు స‌మాజ‌సేవ‌కులు దూడ‌ల సుధీర్‌, మోపూరు రిషిత, కార్తికేయ నాయుడు, జనాన్య, సుమ, సరళ, అధిక‌సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *