32 లొకేషన్స్… 55 సిసి కెమెరాలు

ఇకపై సీసీ కెమెరాల నిఘా నీడలో ముత్తుకూరు

సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్

ముత్తుకూరు పోలీసులను అభినందించిన ఎస్పీ

32 లొకేషన్స్…55 సిసి కెమెరాలు….

  • ఇకపై సీసీ కెమెరాల నిఘా నీడలో ముత్తుకూరు
  • సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ
  • ముత్తుకూరు పోలీసులను అభినందించిన ఎస్పీ

నేర నియంత్రణ లో భాగంగా జిల్లాలో ఐదు వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే టార్గెట్ పెట్టుకున్నామని నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన సిసి కెమెరాల కంట్రోల్ రూమ్ ని ఏఎస్సి సౌజన్య, ఎస్బి డిఎస్పీ శ్రీనివాసరావు, రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస రావు తదితరులతో కలసి ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో మానిటర్స్ ని స్వయంగా పరిశీలించిన ఎస్పీ కెమెరాలు పనితీరు పరిశీలించారు. అనంతరం ఎస్పీ కృష్ణకాంత్ మీడియాతో మాట్లాడుతూ…. ముత్తుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 32 లొకేషన్లలో 55 సిసి కెమెరాలతో ముత్తుకూరులో కంట్రోల్ రూమ్ తో ఇకపై గట్టినిఘా పెట్టేందుకు వీలువుంటుందని చెప్పారు. జిల్లాలో ప్రజానీకం సైతం తమ తమ నివాసాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ లింక్ స్థానిక పోలీసులకు ఇస్తే…దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో కృష్ణపట్నం సిఐ రవీనా, ఎస్ఐ లు విశ్వనాథ రెడ్డి, జే. పి శ్రీనివాస రెడ్డి, వీరేంద్ర, టీడీపీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్, అక్కయ్యగారి ఏడుకొండలలు, ఆర్యవైశ్య సంఘం నాయకులు వోలేటి సత్యం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *