నూతన విద్యా విధానంపై శిక్షణ తరగతులు
ముత్తుకూరులో జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం
సుశిక్షితులైన అధ్యాపకులుగా అంగన్వాడీ సిబ్బంది
- నూతన విద్యా విధానంపై శిక్షణ తరగతులు
- ముత్తుకూరులో జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం
అంగన్వాడీ సిబ్బందికి నూతన జాతీయ విద్యా విధానంపై అవగాహన కల్పించి సుశిక్షితులైన అధ్యాపకులుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా రిసోర్స్ పర్సన్ మాసా ప్రసాద్ చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ఈదురు ఈశ్వరమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమం జరిగింది. జ్ఞాన జ్యోతి కార్యక్రమం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మండలంలోని 73 అంగన్వాడి కేంద్రాల కార్యకర్తలకు శిక్షణ కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ… మూడు సంవత్సరాల కాలంలో 120 రోజులు అంగన్వాడీ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేసి వచ్చే పిల్లలకు కనీస సామర్థ్యం పెంచేలా ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. ఎమ్ ఐ సి కోఆర్డినేటర్ బాపనపాటి సుబ్రహ్మణ్యం, జిల్లా రిసోర్స్ పర్సన్ రాంబాబు, అంగన్వాడి సూపర్వైజర్ సుబ్బమ్మ, అమ్మనమ్మ తదితరులు పాల్గొన్నారు.