12 అయినా…తెరుచుకోని ఆఫీస్‌

సోమ‌వారం గ్రీవెన్స్ కి అధికారులు డుమ్మా

ఖాళీగా కుర్చీలు ద‌ర్శ‌నం

ఇందుకూరుపేట మండ‌ల విద్యాశాఖ‌పై అర్జీదారులు ఆగ్ర‌హం

12 అయినా…తెరుచుకోని ఆఫీస్‌

  • సోమ‌వారం గ్రీవెన్స్ కి అధికారులు డుమ్మా
  • ఖాళీగా కుర్చీలు ద‌ర్శ‌నం
  • మండ‌ల విద్యాశాఖ‌పై అర్జీదారులు ఆగ్ర‌హం

నెల్లూరు జిల్లా కోవూరు నియోజ‌క‌వ‌ర్గం ఇందుకూరుపేట మండ‌లంలోని విద్యాశాఖ కార్యాల‌యంలో ప్ర‌తీ సోమ‌వారం గ్రీవెన్స్ డే నిర్వ‌హిస్తారు. అయితే ఈ సోమ‌వారం మ‌ధ్యాహ్నం 12 అయినా….కార్యాల‌యానికి తాళం వేసే ఉంది. ఇదిలా ఉంటే 12 గంట‌ల త‌రువాత కార్యాల‌యం ఓపెన్ చేసినా…ఖాళీ కుర్చీలే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. కేవ‌లం కార్యాల‌యంలో అటెండ‌ర్ ఒక్క‌రే ఉన్నారు. అత‌న్ని ఎన్‌3 న్యూస్ ప్ర‌తినిధిగా ప్ర‌శ్నించ‌గా…పొంత‌న లేని స‌మాధానం చెబుతుండ‌డం విడ్డూరం. మండ‌ల ప్ర‌జ‌లు ప‌లు స‌మ‌స్య‌ల‌ను మండ‌ల విద్యాశాఖాధికారికి విన్న‌వించుకుందాం వ‌స్తే…ఖాళీ కుర్చీలు ఉండ‌డంతో ఏమీ చేయ‌లేక వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. దీంతో విద్యాశాఖపై అర్జీదారులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వెంట‌నే క‌లెక్ట‌ర్ స్పందించి…మండ‌ల విద్యాశాఖాధికారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని…మండ‌ల ప్ర‌జ‌లకి అందుబాటులో ఉండేలా చూడాల‌ని గ్రామ‌స్థులు కోరుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *