రీ సైక్లింగ్ ప్రాసెస్ విధానం పై ప్రజలకు అవగాహన కలిగించాలి
కలెక్టర్ ఆనంద్
నెల్లూరు కలెక్టరేట్లో స్వచ్చాంధ్ర గురించి వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం
యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ కు స్వస్తి…
- రీ సైక్లింగ్ ప్రాసెస్ విధానం పై ప్రజలకు అవగాహన కలిగించాలి
- కలెక్టర్ ఆనంద్
- నెల్లూరు కలెక్టరేట్లో స్వచ్చాంధ్ర గురించి వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం
యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ కు స్వస్తి చెప్పి, రీ సైక్లింగ్ ప్రాసెస్ విధానం పై ప్రజలకు అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులకు సూచించారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో స్వచ్చాంధ్ర గురించి వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. స్వచ్చాంధ్ర కార్యక్రమం ప్రతి మూడో శనివారం ఒకరోజు నిర్వహించే కార్యక్రమం కాదని, నిరంతరం జరిగే ప్రక్రియ అని అన్నారు. శాఖాపరంగా ప్రతిరోజూ అనేక మంది ప్రజల్ని కలుస్తుంటారని, అటువంటి సందర్భాల్లో స్వచ్చాంధ్ర గురించి అవగాహన కలిగించాలన్నారు. ప్రతి నెలా ఓ ప్రత్యేకమైన ధీమ్ తో జరిగే స్వచ్చాంధ్ర కార్యక్రమాల పై అందరినీ జాగృతం చేయాలన్నారు. యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ కు స్వస్తి చెప్పి, రీ సైక్లింగ్ ప్రాసెస్ విధానం పై ప్రజలను ప్రోత్సహించాలన్నారు. ప్రతి శాఖ వినూత్నంగా ఆలోచించి వ్యర్ధాల పునర్వినియోగానికి సిద్ధం చేసే ప్రణాళికలు రచించి, సంబంధిత నివేదికను ఆర్ డబ్ల్యూ ఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కు అందజేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ వెంకటరమణ డిపివో శ్రీధర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.