నెల్లూరులో ఉద్రిక్త‌త‌

స్టూడెంట్స్ వ‌ర్సెస్ ప్రిన్సిపాల్‌…

స‌మాధానం చెబితే ఇక్క‌డ నుంచి లేస్తాం

ప్రియ‌ద‌ర్శిని కాలేజీ ప్రాంగ‌ణంలో బైఠాయించిన విద్యార్థులు

విద్యార్థుల‌కి మ‌ద్ద‌తు ప‌ల‌కిన విద్యార్థి సంఘం నేత‌లు

రంగంలోకి దిగిన పోలీసులు – విద్యార్థి సంఘాలు, పోలీసుల మ‌ధ్య వాగ్వాదం

నెల్లూరులో ఉద్రిక్త‌త‌…

  • స్టూడెంట్స్ వ‌ర్సెస్ ప్రిన్సిపాల్‌…
  • స‌మాధానం చెబితే ఇక్క‌డ నుంచి లేస్తాం
  • ప్రియ‌ద‌ర్శిని కాలేజీ ప్రాంగ‌ణంలో బైఠాయించిన విద్యార్థులు
  • విద్యార్థుల‌కి మ‌ద్ద‌తు ప‌ల‌కిన విద్యార్థి సంఘం నేత‌లు
  • రంగంలోకి దిగిన పోలీసులు
  • విద్యార్థి సంఘాలు, పోలీసుల మ‌ధ్య వాగ్వాదం

నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం క‌నుప‌ర్తిపాడులోని ప్రియ‌ద‌ర్శిని ఇంజ‌నీరింగ్ కాలేజీ విద్యార్థులు ఆందోళ‌న‌కు దిగారు. క‌ళాశాల ప్రాంగ‌ణంలో పెద్ద సంఖ్య‌లో విద్యార్థులు బైఠాయించి…త‌మ స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించాలంటూ నిర‌స‌న చేప‌ట్టారు. ఈ విష‌యం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయ‌కులు క‌ళాశాల వ‌ద్ద‌కు చేరుకొని…విద్యార్థుల నిర‌స‌న‌కి సంఘీభావం తెలిపారు. ఇరువురు క‌లిసి ప్రిన్సిపాల్‌కి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స‌మాచారం అందుకున్న రూర‌ల్ పోలీసులు కాలేజీ వ‌ద్ద‌కు చేరుకున్నారు. విద్యార్థుల‌కి, విద్యార్థి సంఘాల నేత‌ల‌కి వారు న‌చ్చ చెప్పారు. ప్రిన్సిపాల్ వ‌చ్చి హామీ ఇచ్చే వ‌ర‌కు ఇక్క‌డ నుంచి క‌దిలే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెప్ప‌డంతో….ఇరువురి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం నెల‌కొంది. దీంతో ప్రియ‌ద‌ర్శిని కాలేజీలో కొద్ది సేపు ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది. మ‌ళ్లీ పోలీసుల‌కి వ్య‌తిరేకంగా నినాదాలు హోరెత్తించారు. విద్యార్థి సంఘం నేత ఎన్3 న్యూస్‌తో మాట్లాడుతూ… వేల‌కు వేల‌కు డ‌బ్బులు క‌ట్టించుకుంటున్న యాజ‌మాన్యం…విద్యార్థుల‌కి స‌రైన వ‌స‌తులు క‌ల్పించ‌క‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. దీనిపై వెంట‌నే రాష్ట్ర ప్ర‌భుత్వం స్పందించి విద్యార్థుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేశారు. లేని ప‌క్షంలో నిర‌స‌న‌ను తీవ్ర‌త‌రం చేస్తామ‌ని హెచ్చ‌రించారు. దీనిపైన ప్రిన్సిపాల్‌ని ఎన్‌3 ప్ర‌తినిధి వివ‌ర‌ణ కోర‌గా…మ‌రో 20 రోజుల్లో విద్యార్థుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరిస్తామ‌ని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *