నెల్లూరు వీపీఆర్ కన్వెన్షన్ లో ఘనంగా బీద రవిచంద్ర కుమారుడి వివాహం
గోకుల్ రిష్వంత్
దివిజల దంపతుల్ని ఆశీర్వదించిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, ప్రముఖులు
బీద ఇంట పెళ్లి సందడి…
- నెల్లూరు వీపీఆర్ కన్వెన్షన్ లో ఘనంగా బీద రవిచంద్ర కుమారుడి వివాహం
- గోకుల్ రిష్వంత్ – దివిజల దంపతుల్ని ఆశీర్వదించిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, ప్రముఖులు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, జ్యోతి దంపతుల కుమారుడు గోకుల్ రిష్వంత్, దివిజల వివాహం…నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి…ప్రజాప్రతినిధులు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, వ్యాపారులు, ప్రముఖులు, టీడీపీ శ్రేణులు, నాయకులు, బీద అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి…నూతన వధూవరులను ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో…అష్ఠైశ్వరాలతో…పిల్లాపాపలతో ఆనందంగా గడపాలని కొత్త దంపతుల్ని శ్రీరస్తు… శుభమస్తు…కళ్యాణమస్తు అంటూ దీవించారు. ఎంపీ బీద మస్తాన్రావు, టీడీపీ రాష్ట్ర నాయకులు గూటూరు కన్నబాబు, డాక్టర్ జెడ్ శివ ప్రసాద్ అన్నీ తామై…ప్రతీ ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ స్వాగతం పలికారు.