ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్ ప్లాన్ నిధులు, ఉపాధి కల్పనే ధ్యేయంగా అడుగులు
కావలికి వచ్చిన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్
పలు డిమాండ్లతో మాల మహానాడు, ఉద్యోగుల సంఘం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కు వినతి
ఎస్సీ కార్పొరేషన్ కు నూతన జవసత్వాలు తెస్తాం…
- ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్ ప్లాన్ నిధులు, ఉపాధి కల్పనే ధ్యేయంగా అడుగులు
- కావలికి వచ్చిన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్
- పలు డిమాండ్లతో మాల మహానాడు, ఉద్యోగుల సంఘం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కు వినతి
గత వైసీపీ పాలనలో నిర్వీర్యమైన ఎస్సీ కార్పొరేషన్ కు తిరిగి నూతన జవసత్వాలు తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ తెలిపారు. శనివారం రాత్రి ఆయన కావలికి వచ్చారు. ఆయనను మాల మహానాడు, మాల ఉద్యోగుల సంఘం నాయకులు కలిశారు. వీరితో కలిసి బ్రిడ్జి సెంటరులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఎస్సీ వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయనకు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ ఎన్ త్రీ న్యూస్ తో మాట్లాడారు. మాల సామాజిక వర్గం అభ్యున్నతికి ఏంచేస్తే బాగుంటుందోనని ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. సబ్ ప్లాన్ నిధులు సక్రమంగా సద్వినియోగం చేసేలా, ఉపాధి కల్పనే ధ్యేయంగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. మాల మహానాడు నాయకులు ఎల్లంటీ వెంకటేశ్వర్లు, ప్రెసిడ్ మేడికొండ సుకుమార్, సెక్రటరీ ఎస్.రమేష్, ఎమ్. విజయ్ కుమార్, ఎమ్. గోపాల్ రావు, ఎమ్. మాచెర్ల ఆత్మకూరి బ్రహ్మయ్య, మొలతాటి మనోహర్, జి. ప్రసాద్, ఎస్. దినేష్, తదితరులు పాల్గొన్నారు.