విద్యార్థుల‌ను ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్యే

పేట హాస్పిట‌ల్‌లో త‌ల్లిదండ్రుల ఆర్త‌నాధాలు

హాస్పిట‌ల్ ఎదుట నిర‌స‌న‌కు దిగిన విద్యార్థి సంఘాల నేత‌లు

క్ష‌త‌గాత్రులైన పిల్ల‌ల‌తో మాట్లాడిన ఎమ్మెల్యే విజ‌య‌శ్రీ‌

స్కూల్ యాజ‌మాన్యం ఖ‌చ్చితంగా నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌లు

వాహ‌నాల ఫిట్‌నెస్‌పై ప‌లుమార్లు హెచ్చ‌రించామ‌న్న ఆర్టీవో అనీల్‌కుమార్‌

నిర్ల‌క్ష్యం వ‌హించిన స్కూల్ యాజ‌మాన్యంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న విద్యార్థి సంఘాల నేత‌లు

విద్యార్థుల‌ను ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్యే

  • పేట హాస్పిట‌ల్‌లో త‌ల్లిదండ్రుల ఆర్త‌నాధాలు
  • హాస్పిట‌ల్ ఎదుట నిర‌స‌న‌కు దిగిన విద్యార్థి సంఘాల నేత‌లు
  • క్ష‌త‌గాత్రులైన పిల్ల‌ల‌తో మాట్లాడిన ఎమ్మెల్యే విజ‌య‌శ్రీ‌
  • స్కూల్ యాజ‌మాన్యం ఖ‌చ్చితంగా నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌లు
  • వాహ‌నాల ఫిట్‌నెస్‌పై ప‌లుమార్లు హెచ్చ‌రించామ‌న్న ఆర్టీవో అనీల్‌కుమార్‌
  • నిర్ల‌క్ష్యం వ‌హించిన స్కూల్ యాజ‌మాన్యంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న విద్యార్థి సంఘాల నేత‌లు

తిరుప‌తి జిల్లా త‌డ మండ‌లం బోడిలింగాల‌పాడు వ‌ద్ద ఓ ప్రైవేట్ స్కూల్ బ‌స్సు బోల్తా ప‌డిన విష‌యం విధిత‌మే. ఈ ప్ర‌మాదంలో 16 మంది విద్యార్థుల‌కు పైగా గాయాలు కావ‌డంతో వారిని సూళ్లూరుపేట‌, త‌డ ప్ర‌భుత్వ వైద్య‌శాల‌ల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఆయా వైద్య‌శాల‌ల వ‌ద్ద‌కు చేరుకుని త‌మ పిల్ల‌లను చూసి క‌న్నీరుమున్నీర‌య్యారు. న‌వ్వుతూ ఇళ్ల వ‌ద్ద నుంచి బ‌య‌ల్దేరిన పిల్ల‌ల‌కు గాయాలై ఉండ‌డంతో చూసి త‌ట్టుకోలేక ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అలాగే ప్ర‌మాద సంఘ‌ట‌న‌ను తెలుసుకున్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెల‌వ‌ల విజ‌య‌శ్రీ హుటాహుటీన వైద్య‌శాల‌కు చేరుకుని విద్యార్థుల‌తో, వారి త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడారు. మీకు తోడుంటామ‌ని ధైర్యం చెప్పారు. వైద్యుల‌తో మాట్లాడి గాయ‌ప‌డిన విద్యార్థుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని ఎమ్మెల్యే సూచించారు. స్కూల్ యాజ‌మాన్యం ఖ‌చ్చితంగా నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచించారు. ప్ర‌మాద విష‌య‌మై స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు చెప్పారు. స్కూల్ బ‌స్సు బోల్తా విష‌యం తెలుసుకుని వైద్య‌శాల వ‌ద్ద విద్యార్థి సంఘాల నేత‌ల చేరుకుని విద్యార్థుల‌ను ప‌రామ‌ర్శించి వైద్య‌శాల వ‌ద్ద‌, అనంత‌రం ప్రైవేట్ పాఠ‌శాల ఎదుట‌ నిర‌స‌న వ్య‌క్తం చేశారు. నిర్ల‌క్ష్యం వ‌హించిన స్కూల్ యాజ‌మాన్యంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విద్యార్థి సంఘాల నేత‌లు డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వం త‌ర‌పున క్ష‌త‌గాత్రుల‌ను ఆదుకోవాల‌ని కోరారు. ఈ విష‌య‌మై ఆర్టీవో అనీల్‌కుమార్ మాట్లాడుతూ కాలం చెల్లిన వాహ‌నాల వినియోగం వ‌ల్ల‌నే ప్ర‌మాదం జ‌రిగింద‌న్నారు. ప‌లుమార్లు స్కూల్ యాజ‌మాన్యానికి సూచ‌న‌లు చేశామ‌ని తెలిపారు. వాహ‌నాల ఫిట్‌నెస్ విష‌యంలో అల‌స‌త్వం వ‌హిస్తే స‌హించ‌బోమ‌ని హెచ్చ‌రించారు. అదేవిధంగా ప్ర‌మాద స‌మాచారం అందుకున్న సీఐ ముర‌ళీకృష్ణ‌, ఎస్ఐ బ్ర‌హ్మ‌నాయుడు వైద్య‌శాల‌కు ముందుగా చేరుకుని విద్యార్థుల‌కు ధైర్యం చెప్పారు. వారి త‌ల్లిదండ్రుల‌కు భ‌రోసా ఇచ్చారు. ప‌రిస్థితిని స‌మీక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *